TSPSC : గ్రూప్ _1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ విడుదల…!

Telangana: తెలంగాణ గ్రూప్_1 ప్రిలిమ్స్ తుది కీ  విడుదలైంది. టీఎస్పీఎస్సీ అధికారులు ఫైనల్ కీ ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. జూన్ 28న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి సంబంధించి ప్రాథమిక కి రిలీజ్ అయింది. అనంతరం అధికారులు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న TSPSC   ఫైనల్ కీ విడుదల చేసింది.

Read More

వైసీపీ పాలనతో పదడుగులు వెనక్కి వెళ్లిపోతున్నాం: పవన్ కళ్యాణ్

Janasena : తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో 2024 ఎన్నికల్లో కచ్చితంగా జనసేన జెండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆరు నూరైనా సీటూ, గెలుపూ మనదేనని స్పష్టం చేశారు. తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ని గెలిపించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో క్లిష్టమైన సమయంలో మనోహర్ గారు అసెంబ్లీని ఎంతో సమర్థంగా నడిపించిన విధానం ఆయనలోని నాయకత్వ పటిమను, రాష్ట్రం పట్ల ఆయనకున్న నిబద్ధతను వెల్లడించాయన్నారు. అటువంటి…

Read More

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం కు పోటెత్తిన జనం..

Yuvagalam: రాష్ట్రంలో కోట్లాదిప్రజల గొంతుకగా మారి రోజురోజుకూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకుసాగుతున్న యువగళం పాదయాత్ర మరో మైలురాయిని అధిగమించింది. జోరువర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో యువగళం జైత్రయాత్ర దిగ్విజయంగా పూర్తయింది.  జూలై 15వతేదీన రాళ్లపాడు సరిహద్దుల్లో కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టిన యువనేత లోకేష్ పాదయాత్ర 17రోజులపాటు నిర్విరామంగా సాగింది. ఉమ్మడి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 220 కి.మీ.ల మేర కొనసాగిన యువగళానికి ప్రకాశం జిల్లా ప్రజలనుంచి కనీవినీ ఎరుగని…

Read More

BJPTelangana: బండికి ప్రమోషన్.. అరుణకు మరోసారి అవకాశం..!

BJPTelangana:  తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ నాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నేతలకు కీలక బాధ్యతలను అప్పగించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది.అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డీకేఅరుణకు రెండో సారి అవకాశం కల్పించింది. ఏపీ బీజేపీ నేత సత్యకుమార్‌ను రెండోసారి బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు అరుణ్‌ సింగ్‌ నేతల నియమాకాలకు…

Read More

తెలంగాణాలో ‘బీసీ’ అస్త్రం పాచిక పారేనా ?

Telanganapolitics:  తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల రాజకీయాల్లో సామాజిక వర్గాలు పాచికలుగా మారుతున్నాయి.  జనాభాలో 50 శాతానికిపైగా ఉన్నా రాజకీయంగా వెనుకబడి ఉన్నామనే అసంతృప్తి అన్ని రాజకీయ పార్టీల్లో నెలకొంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే ప్రతీసారి ఎన్నికలకు ముందు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలనే డిమాండ్‌ను వివిధ బీసీ సంఘాలు లేవనెత్తడంతోపాటు రాజకీయ పార్టీల్లోని ఆ వర్గానికి చెందిన నాయకులు కూడా డిమాండ్లు పెట్టడం సర్వసాధారణం. అయితే ఈ డిమాండ్‌ను ఎక్కువగా కాంగ్రెస్‌ పార్టీ…

Read More

తెలంగాణలో గెలుపుపై ధీమాగా ప్రధాన పార్టీలు:

Bojja Rajashekar: ( senior journalist) Telanganapolitics: ఆలు లేదు.. చూలు లేదు. కొడుకు పేరు సోమలింగం అనే రీతిలో తెలంగాణలో రాజకీయ పార్టీలు అధికారంపై కలలు కంటున్నాయి. ఎన్నికల నగరా మోగక ముందే గెలుపు మాదంటే మాదంటూ ఊదరగొట్టే ప్రసంగాలతో దంచేస్తున్నాయి. తెలంగాణలో రెండోసారి అధికారంలో కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ మూడో సారి తామే గెలుస్తామని ధీమాలో ఉంది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ సారి అధికారంలోకి వస్తామని భావిస్తోంది. ఒకటి…

Read More

ఏపీలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా ప్రకటించడంపై కేంద్రంకు ఫిర్యాదు!

Nancharaiah merugumala ( political analyst): ఆంధ్రాలో అహ్మదియాలను ‘కాఫిర్లు’గా రాష్ట్ర వక్ఫ్‌ బోర్డ్‌ ప్రకటించడంపై కేంద్ర సర్కారుకు ఫిర్యాదు! ====================== ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌ బోర్డ్‌ రాష్ట్రంలోని అతి చిన్న ముస్లిం మైనారిటీ వర్గం అహ్మదియాలను కాఫిర్లుగా (ముస్లిమేతరులుగా) ప్రకటిస్తూ ఫిబ్రవరి మాసంలో తీర్మానం చేసింది. తమను తాము ఆచరించే ఇస్లాం నుంచి బహిష్కరించారని, ఈ విషయంలో జోక్యం చే సుకుని తమను కాపాడాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అహ్మదియాలు విన్నవించుకున్నారు కిందటి వారం. భారత…

Read More

తెలంగాణలో టగ్ ఆఫ్ వార్.. బీఆర్ఎస్ కు కష్టమే..?

Telangana: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుంది. ఎన్నికలకు  నాలుగు నెలలు మాత్రమే గడువు ఉండడంతో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని స్పీడ్ అప్ చేశాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో హ్యాట్రిక్ పై కన్నేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రభుత్వంపై  వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని అస్త్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని పట్టుదలతో ఉన్నాయి.ఇప్పటికే రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ జరిగేందుకు ఆస్కారం ఉందని…

Read More

పోలీస్ శాఖ గౌరవాన్ని పెంచే విదంగా పనిచేయాలి: ఎస్పీ అపూర్వ రావు

Nalgonda: ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి పదోన్నతి పొందిన CI, ARSI లు జిల్లా పోలీస్ కార్యాలయంలో Sp అపూర్వ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన  CI లకు,ARSI లకు యస్.పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం  యస్.పి మాట్లాడుతూ.. పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకం అవుతూ బాధ్యతతో పని చేసి  ప్రజల యొక్క మన్ననలు పొందే విధంగా పని చేయాలని హితువు పలికారు.  పోలీస్ స్టేషన్ కు…

Read More

Telangana: డబుల్ బెడ్ రూం ఇళ్ళ పంపిణీపై బీజేపీ ధర్నాలు

BJPTelangana: డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేయాలనే డిమాండ్‌తో తెలంగాణా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇళ్లను నిరుపేదలకు పంపిణీ చేయాలని ధర్నాలు, ఆందోళనల్లో నేతలు డిమాండ్‌ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి.. ప్రజల్ని మోసం చేశారని కమలం పార్టీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల సమీపించడంతో మరోసారి ఓట్లు దండుకునే ప్రయత్నాలు ప్రారంభించారని విమర్శించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సొంత ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్…

Read More
Optimized by Optimole