ManmohanSingh : మంచి పనుల్తో మాట్లాడిన మౌని..!

ManmohanSingh: పీవీ నర్సింహారావు దూరదృష్టి, సోనియాగాంధీ త్యాగం.. వెరసి, భారత దేశానికి కీలక సమయంలో పదేళ్లు ప్రధానమంత్రిగా లభించిన మానవతానేత మన్మోహన్సింగ్! ‘మాట్లాడరు, సొంత నిర్ణయాలు తీసుకోలేరు, టెన్ జన్పథ్ చేతిలో కీలుబొమ్మ’ లాంటి విమర్శలున్నా… ఎన్నో విషయాల్లో ఆదర్శనేత ఆయన. నిగర్వి, నిరాడంబరుడు, నిష్కళంకుడు, అన్నిటికీ మించి పక్కా నిజాయితీపరుడు. కష్టకాలంలో దేశాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేసిన సంస్కర్త. ఆర్బాటం లేకుండా దశాబ్దాల తరబడి దేశ గమనాన్ని నిర్దేశించే ఉపాధిహామీ, ఆహారభద్రత, సమాచారహక్కు, విద్యాహక్కు, భూసేకరణ-2013, కనీస…

Read More

ManmohanSingh: చేతల నేత డా.మన్మోహన్ సింగ్..!

INCTELANGANA:  నిజయితీకి, నిరాడంబరకు మారుపేరైన డా. మన్మోహన్ సింగ్కు తెలంగాణ రాష్ట్రానికి అవినాభావ సంబంధం ఉంది. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కల నెరవేర్చిన దేవుడు ఆయన. రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో అడ్డకుంలు ఎదురైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఎన్ని కష్టాలైన ఓర్పుతో సహించి మనకు రాష్ట్రం ఇచ్చిన డా.మన్మోహన్ సింగ్కు తెలంగాణ ప్రజలు ఎంతో రుణపడి ఉంటారు. డా.మన్మోహన్ సింగ్ హయాంలో తెలంగాణ ఏర్పాటును ఒక కాంగ్రెస్ నేతగా,…

Read More

Telangana: అన్ని పండుగల్లా రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి..!

Telangana:   జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా LTI Mind Tree Foundation సహకారంతో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవ వేడుకలను గట్టు మండలం, బలిగెర గ్రామంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి (IVDP) లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బాలరాజు రాజారాం, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేకమైన పండుగగా జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. రైతులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి,…

Read More

Elections: ‘‘ఒక దేశం- ఒక ఎన్నిక’’పై.. ఒక మాట..!

OneNation- one election: ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశమేం కాదు! అంతకన్నా ప్రాధాన్యతగల అంశాలెన్నో దిక్కూ-దివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందా సంస్కరణలు ముఖ్యం. పదేళ్ల బీజేపీ, ‘తరచూ వాదనలు మార్చే’ (షిఫ్టింగ్ న్యరేటివ్స్) ఒరవడిలో భాగంగా…

Read More

Telangana: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలి: రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ

Atmakur: పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని ఆత్మకూరు రైతు సంఘం మండల అధ్యక్షులు తుమ్మల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కందడి వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా తుమ్మల సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ఎరువుల ధరలను అడ్డగోలుగా పెంచి రైతుల పై మోయలేని భారాలు పెట్టీ రైతుల నడ్డి విరుస్తుందని…

Read More

TPCC : మాజీ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ…!

INCTELANGANA : మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నాయకులు, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ   బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ =================================================================== ఎంతో రాజకీయ అనుభవమున్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మీ భారత్ రాష్ట్ర సమితి నేతలు మా ప్రభుత్వంపై…

Read More

SURYAPETA: చివ్వెంలలో ఉమ్మడి డైట్ పెంపును ప్రారంభించిన టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి..!

SuryaPeta: తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉమ్మడి డైట్ అమలును సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు,కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ నేతలు అట్టహాసంగా ప్రారంభించారు. చివ్వెంల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఉమ్మడి డైట్ చార్జీల పెంపు కార్యక్రమాన్ని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్, TPCC ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సంక్షేమ గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులు, వారి తల్లి దండ్రులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ,…

Read More

EVM: ఈవీఎంల మాయ ఉన్నట్టా..?  లేన్నట్టా..?  

EVMS: ‘ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాకుండా ఉన్నట్టు కనబడాలి’ అనేది పాలన మౌలిక సూత్రం! అప్పుడే ప్రజలకు విశ్వాసం. ఆ విశ్వాసంతోనే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు స్వేచ్చగా- స్వతంత్య్రంగా పాల్గొంటారు. మనది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే కాక భాగస్వామ్య ప్రజాస్వామ్యం. తమ పాలకుల్ని స్వేచ్ఛగాస్వతంత్రంగా ఎంచుకునే ఎన్నికల ప్రక్రియ నుంచి సంపూర్ణ పాలన వరకు అన్ని దశల్లో, స్థాయిల్లో ప్రజలు స్వచ్చందంగా, విశ్వాసంతో పాల్గంటారు. అలా పాల్గనేలా చూడాల్సిన బాధ్యత పాలకులది. దేశం పలుదెసల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా…

Read More

‘వ్యూహా’ల పరుగులో ‘చిత్త’వుతున్న రాజకీయం..!

Political strategists: రాజకీయపార్టీల బాగుకు వ్యూహకర్తలు, వ్యూహసంస్థలు కావాలా? దేశ రాజకీయాల్లో ఓ కొత్త ఒరవడి బలపడుతోంది. ఏమాత్రం ప్రభావాల అంచనా (ఇంపాక్ట్ అసెస్మెంట్) లేకుండా సాగే ఈ ప్రక్రియలో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతోంది. పుట్టగొడుగుల్లా వ్యూహ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. సోషల్మీడియా వేదికల్ని అతిగా వాడుతూ, అసలు జనాభిప్రాయం మరుగుపరుస్తూ రాజకీయ వాతావరణ కాలుష్యం చేస్తున్నారు. ఆకర్షణీయ నినాదాల జిత్తులు, దృష్టి మళ్లింపు ఎత్తులు, వాణిజ్య మెళుకువలు, వ్యాపార చిట్కాలు… వంటి మార్కెట్ మాయలొచ్చి…

Read More

BRS:‘సైన్యాధ్యక్షుడు’రాని యద్ధం.. నెగ్గేదెలా?

BRSParty: బీఆర్ఎస్ లో అంతర్మధనం..! ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవం‘ టారు. ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజామద్దతు కాంగ్రెస్ నిలబెట్టుకోకున్నా, ఓటమి నుంచి పాఠం నేర్చి బీఆర్ఎస్ పుంజుకోకున్నా, తద్వారా ఏర్పడే శూన్యంలోకి బీజేపీ విస్తరించకపోయినా… అది మూడు పార్టీలకీ రాజకీయ ఆత్మహత్యా సదృశమే! కాస్త హెచ్చు-తగ్గులతోనే అయినా… ముగ్గురి ముంగిటా ఇపుడు అవకాశాలున్నాయి. అంతా అయ్యాక, తమ దుస్థితికి ఎదుటివారొకరిని నిందించి ప్రయోజనముండదు. స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోవడంలోనే నైపుణ్యం, విజయరహస్యం దాగి ఉంది….

Read More
Optimized by Optimole