indianarmy: ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏం చేయాలి?

Operationsindoor: భారత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చగా మారింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఇప్పటివరకు తొమ్మిది స్థావరాల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై అధికారికి ప్రకటన రావాలి. బవహల్పూర్‌(జైషే మహమ్మద్‌), మురిద్కే(లష్కరే తొయిబా) క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒక్కో క్యాంపులో 25-30 మంది మృతులు ఉన్నట్లు సమాచారం. కానీ…

Read More

Castcensus: కులగణనపై మోదీ యూ-టర్న్ ఎవరికి లాభం?

Castcensus: దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు కొన్నేళ్లుగా కులగణన డిమాండ్లు వినిపిస్తున్నా… హిందువులంతా ఒక్కటే అని చెప్తూ వచ్చిన బీజేపీ, ఎవరూ ఊహించని విధంగా కులగణన నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో జనాభా లెక్కలతోనే కులగనణ చేపట్టాలని తీర్మానించింది. కులగణన మీదే రాజకీయాలు నడుపుతున్న ప్రతిపక్షాల నోరు మూయించడానికే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు విరుద్ధంగా తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి ప్రమాదం తెచ్చిపెట్టనుందా? అనే చర్చ మొదలైంది. మన దేశంలో మతం కన్నా…

Read More

KAVITHA: బిఆర్ఎస్ పార్టీకి క‌విత గుడ్ బై..?

telangana:  బిఆర్ఎస్ పార్టీతో తాడో పేడో తేల్చుకునేందుకు ఎమ్మెల్సీ క‌విత సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.మేడే సంద‌ర్భంగా వేదిక‌పై ఏర్పాటు చేసిన ప్లెక్సీలో కేసీఆర్ ఫోటో క‌న‌ప‌డ‌క‌పోవ‌డం.. ఆయ‌న స్థానంలో ప్రోఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ ఫోటో ద‌ర్శ‌నమివ్వ‌డం ఇందుకు నిద‌ర్శ‌నంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో ఎదురైన అవ‌మానంతో త‌గ్గేదేలే అన్న‌ట్లు రాజ‌కీయ ప్ర‌యాణం ఉండ‌బోతోంద‌ని క‌విత చెప్ప‌క‌నే చెప్పింద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అయితే ఆమె వేరే పార్టీలో చేర‌తారా లేక తెలంగాణ జాగృతి పేరుతో ఒంట‌రి పోరాటం చేస్తార‌న్న‌ది…

Read More

KAVITHA: క‌విత దారెటు…?

Telangana:  మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ క‌విత బిఆర్ఎస్ పార్టీకి దూరం కానున్నారా? అంటే అవుననే స‌మాధానం వినిపిస్తోంది. బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ సాక్షిగా త‌న రాజ‌కీయ వార‌సుడు కేటీఆర్ మాత్ర‌మేన‌ని కేసీఆర్ ప‌రోక్షంగా సంకేతాలు ఇవ్వ‌డంతో క‌విత పార్టీని వీడేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లిక్క‌ర్ స్కాంలో జైలుకి వెళ్లి వ‌చ్చిన నాటి నుంచి ఆమెను కేసీఆర్ కుటుంబం రాజ‌కీయాల‌కు దూరంగా పెడుతు వ‌స్తోంది. నాటి నుంచి జాగృతి పేరుతో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వివిధ…

Read More

BiharElection: బీహార్‌ ఎన్నికలు… ఎన్నెన్నో ప్రశ్నలు..!

BiharElection: బీహార్‌ రాష్ట్రం… 13 కోట్ల జనాభాకు నెలవు! సుమారు 8 కోట్ల ఓటర్లు ఉన్న ఆ రాష్ట్రంలో మరో 7 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహారీల్లో అభివృద్ధి, ఉపాధి కావాలని, వలసలు నియంత్రించాలని డిమాండ్స్‌ పెరగడం, కొత్త పార్టీలు పుట్టుకురావడం నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్న దశలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్‌లో బీహార్‌ రాష్ట్రానికి…

Read More

INC: కాలంతో కాంగ్రెస్ కాలు కదిపితేనే…!

INC: కాంగ్రెస్ పునర్వైభవం, కాంగ్రెస్ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) 86వ జాతీయ సమావేశ వేదిక వెల్లడి చేసింది. పాత విషయాల వల్లెవేతనే తప్ప… జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశాలేవీ తీర్మానాల్లోకి రాలేదు. రాజ్యాంగ స్ఫూర్తి రక్ష, లౌకికవాద పరిరక్షణ,…

Read More

National: బీహార్ లో మళ్లీ కులాల కుంపటేనా..?

BiharElection: ఉత్తరాదిన రెండో పెద్ద రాష్ట్రమైన బీహార్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల రాజకీయ సెగతో అన్ని పార్టీలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 చివరిలో జరగనున్న ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాఘట్బంధన్ (ఎంజీబీ) కూటముల్లో మార్పులు, చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగ ప్రవేశం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో పలు ఆసక్తికరమైన…

Read More

Telangana: దేశీయ విత్తనాలను అభివృద్ధి పరుచుకోవాలి: మోహన్ గురుస్వామి

Telangana:  భూతాప ప్రమాద ఘంటికలు మోగుతున్న ఈ తరుణంలో దేశీయ విత్తనాల అభివృద్ధి పరుచుకోవడమే పరిష్కారమని ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు మోహన్ గురుస్వామి అన్నారు. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సీజీఆర్ & భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ సంయుక్త ఆధ్వర్యంలో కడ్తాల్ మండలం, అన్మాస్ పల్లిలో నిర్వహిస్తున్న విత్తన పండుగ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. భూతాపం రోజురోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో ఒక డిగ్రీ సెంటీగ్రేట్ ఉష్ణోగ్రత పెరిగినట్లయితే 15…

Read More

Telangana:తెలంగాణ ఎమ్మెల్యేల ప‌నితీరుపై పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ షాకింగ్ రిపోర్టు..!

Telangana: తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సర్వేలో బీఆర్ఎస్కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్కు చెందిన సంగారెడ్డి శాసనభ్యులు చింతా ప్రభాకర్ చివరి స్థానంలో నిలిచినట్లు తేలింది. పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ 28 మార్చి నుండి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది….

Read More

TELANGANA: సన్నబియ్యం పంపిణీతో పేదలకు పండుగ..

INCTELANGANA :  -బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు ============================= తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే పలు విప్లవాత్మక చర్యలతో చరిత్ర సృష్టిస్తోంది. ఆ పరంపరలో భాగంగా ఉగాది, రంజాన్ శుభ సందర్భంగా రాష్ట్రంలోని రేషన్ షాపులలో సన్నబియ్యం అందించే ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఇప్పటికే మహిళా సాధికారత కోసం తెలంగాణ ఆడబడుచులకు పలు పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలను ఆపన్న హస్తం అందిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా కాంగ్రెస్…

Read More
Optimized by Optimole