Karimnagar: ‘‘మోదీ గిఫ్ట్’’ పేరుతో టెన్త్ విద్యార్థులకు బండి సంజయ్ నజరాన..!

Karimnagar: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ శుభవార్త. ఈ ఏడాది టెన్త్ ఎగ్జామ్ ఫీజును పూర్తిగా చెల్లించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముందుకొచ్చారు. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు కేంద్ర మంత్రి లేఖ రాశారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,292 మంది విద్యార్ధినీ, విద్యార్థులు పదో తరగతి చదువుకుంటున్నారు. వీరిలో కరీంనగర్…

Read More

Apnews: కూటమి ప్రభుత్వములోనే రైతులకు న్యాయం: మంత్రి నాదెండ్ల

విజయవాడ, నవంబర్ 5: కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధం అయ్యామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే రూ.12,200 కోట్లు విలువైన ధాన్యం కొనుగోలుకు సిద్ధం అయినట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకు 4041…

Read More

Apnews: మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి: పవన్ కళ్యాణ్

Apnews: మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు….

Read More

Apnews: కౌలు రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాలు…!!

Apnews: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవశేష ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏరాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు…

Read More

Hyderabad: మరోసారి బట్టబయలైన కేటీఆర్ ఫేక్ ఓటర్ల బాగోతం…!!

Hyderabad:  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల‌ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు మరోసారి తప్పని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నకిలీ ఓటర్లను నమోదు చేసిందని కేటీఆర్ ప్రదర్శించిన వివరాలలోని డొల్లతనం తేటతెల్లమైంది. కేటీఆర్ ఆరోపణల ప్రకారం, 19,000 ఓటర్లను జాబితాలో చేర్చార‌ని, ఇందులో 1,942 ఓటర్లు పలుమార్లు నమోదయ్యారని, యూసుఫ్‌గూడ‌లోని రెండు చిరునామాలలో వ‌రుస‌గా 32, 43 మంది ఓటర్లు, హైలం కాల‌నీలో అడ్ర‌స్సులేని చిరునామాలో 42 మంది ఓటర్లు ఉన్నారని…

Read More

Jubileehills: హీటెక్కిన ఉప ఎన్నిక- పీజేఆర్ వారసుల బహిరంగ సవాల్…!

Jublihills: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నేతల సవాళ్లు–ప్రతిసవాళ్లతో ఉప ఎన్నిక హీటెక్కింది. తాజాగా ఉప ఎన్నిక పోరులో కుటుంబ సభ్యులే రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. పీజేఆర్ వారసులైన అక్క–తమ్ముడు మధ్య సాగుతున్న సవాళ్లు_ ప్రతి సవాళ్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి. కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్‌లో ఎగరేస్తానని అక్క విజయారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే, కాంగ్రెస్ జెండా ఎగరనీయనని తమ్ముడు విష్ణు వర్ధన్ రెడ్డి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో…

Read More

Telangana: కేసిఆర్ ఫోటో లేకుండా కవిత ప్రయాణం..!

Hyderabad: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరో కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై జాగృతి ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాల్లో తన తండ్రి కెసిఆర్ ఫోటోకి బదులు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో వాడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.దీనికి తోడు అక్టోబర్ నెలాఖరులో ఆమె కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడం లక్ష్యంగా కవిత భారీ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తూ, రెండు…

Read More

telangana:మ‌రోసారి అడ్డంగా బుక్కైన కేటీఆర్‌…!!

హైద‌రాబాద్‌: అధికార కాంగ్రెస్ ప్ర‌భుత్వం మీద‌ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాగిస్తున్న విష‌ప్ర‌చారం మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది. ప్ర‌తి సంద‌ర్భంలో ఆయ‌న‌ ప్ర‌భుత్వాన్ని నిందిస్తూ త‌ప్పుడు ప్ర‌చారానికి తెర‌లేపుతున్నట్టు రుజువైంది. తాజాగా జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్‌ న‌కిలీ ఓట‌ర్ల‌ను న‌మోదు చేస్తోందంటూ ఆయ‌న చేస్తున్న దుష్ప్ర‌చారం త‌ప్ప‌ని నిరూపిత‌మైంది. ఓట‌ర్ల న‌మోదు ప్ర‌క్రియ‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలోనే ఓట‌ర్ల న‌మోదు: ఇటీవ‌ల జూబ్లీహిల్స్‌లోని ఒకే ఇంట్లో 43 మంది న‌కిలీ…

Read More

Biharelection: బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా..?

Bihar Elections2025: జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. పీపుల్స్ పల్స్…

Read More

Telangana: సమ్మెల వెనుక అదృశ్య శ‌క్తులు..!!

Telangana: తెలంగాణ‌లో ఇటీవ‌ల జ‌రుగుతున్న కొన్ని కీల‌క ప‌రిణామ‌ల వెనుక అదృశ్య‌ శ‌క్తుల‌ కుట్ర ఉంద‌ని ప్ర‌భుత్వం అనుమానిస్తోంది. కేవ‌లం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై క‌క్ష తీర్చుకోవాల‌న్న ఉద్దేశంతో పేదల‌కు విద్య, ఉపాధి, వైద్య స‌దుపాయాల‌ను దూరం చేయ‌డానికి కూడా కొంద‌రు వెనుకాడ‌డం లేద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఉన్న‌త విద్యా సంస్థ‌ల మూసివేత వెనుక‌, ఆరోగ్య‌శ్రీ నిలిపివేత వెనుక‌ కంటికి క‌నిపించ‌ని రాజ‌కీయ శక్తుల ప్ర‌మేయం ఉన్న‌ద‌నే అనుమ‌నాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పేద‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప‌ణంగా పెడుతున్న‌రు! ఇటీవ‌ల తెలంగాణ‌లో…

Read More
Optimized by Optimole