ప్రశ్నిస్తే…. అరెస్ట్ చేస్తారా?: బండి సంజయ్

టీఎస్పీఎస్సీ ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని  ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదని స్పష్టం చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతామని ఉద్ఘాటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల…

Read More

ఉచిత విద్య వైద్యం కోసం జనసేన కట్టుబడి ఉంది: పవన్ కళ్యాణ్

అమరావతి: రాష్ట్రంలో వైసీపీ ఏది జరగకూడదని కోరుకుంటుందో అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.  జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ మచిలీపట్నంలో  న భూతో న భవిష్యతీ రీతిలో జరిగింది. అశేష జన సందోహం మధ్య జనసేనాని అధ్బుతమైన ప్రసంగంతో  ఆకటుకున్నారు. రాబోవు రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పోషించబోయే పాత్రను సభ వేదికగా పవన్ క్లియర్ కట్ గా తేల్చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన బలమైన రాష్ట్ర రాజకీయ యవనికపై…

Read More

ప్రజాపోరాటమే జనసేన ప్రస్థానం : నాదెండ్ల మనోహర్

అమరావతి: ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే అభద్రతా భావంతో గడప గడపకు కార్యక్రమంలో స్టిక్కర్లు అంటిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎద్దేవ చేశారు. డబ్బు సంపాదనకే తప్ప… రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక వైసీపీ నాయకులకు లేదని ఆయన అన్నారు. చెడ్డవాడి చేతిలో చట్టం ఉంటే… చట్టం కూడా చెడిపోతుందని, అదే మంచివాడి చేతిలో ఉంటే ప్రజల జీవితాల్లో మార్పు తథ్యమని జోస్యం చెప్పారు. అధ్వాన్నంగా…

Read More

పోలవరం పై ప్రధాని మోదికీ కేవీపీ రామచంద్ర రావు లేఖ..

APPOLITICS : పోలవరం పై ప్రధాని నరేంద్ర మోదీకి  మాజీ రాజ్యసభ సభ్యులు డా. కే‌వి‌పి రామచంద్ర రావు లేఖ రాశారు. జాతీయ‌ ప్రాజెక్టు నిర్మాణం ప‌ట్ల  ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్య వైఖ‌రిని నిర‌సిస్తూ  కేవీపీ లేఖ‌లో ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. కేంద్ర‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పోలవరం ఈనాడు అనాధ లా  మిగిలిపోయిందన్నారు. స‌కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి  కేంద్రం నిధులు కేటాయించకపోవడం వల్ల సముద్రం లోకి వృధాగా పోయే 300 పైగా టి‌ఎం‌సి ల నీటిని వినియోగంలోకి…

Read More

ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలపై జ‌న‌సేన సెటైరిక‌ల్ కార్టూన్‌..

APMLCELECTIONS: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ న‌డుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజ‌క‌వ‌ర్గంలో చూసిన ఎన్నికల్లో అధికార పార్టీ ప్ర‌లోభాల‌కు పాల్ప‌డుతోంది. వైసీపీ నేత‌లు డ‌బ్బులు పంచుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఈనేప‌థ్యంలోనే జ‌న‌సేన పార్టీ రూపొందించిన కార్టూన్ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. కార్టూన్ పై నెటిజ‌న్స్ వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు.  ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రలోభాలకు తోడు 6,7 త‌ర‌గతుల చ‌దివిన మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి వైసీపీ నేతలు ఓట్లేయిస్తున్నారు. ఓ…

Read More

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏపార్టీ బ‌ల‌మెంత‌? షాకింగ్ స‌ర్వే రిపొర్ట్‌..ఎక్స్ క్లూజివ్‌..!!

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రాజ‌కీయం వాడీవేడిగా న‌డుస్తోంది. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈజిల్లాలో..2019 ఎన్నిక‌ల్లో వైసీపీ పాగా వేసింది. మొత్తం 15 స్థానాల‌కు గాను 13 అసెంబ్లీ స్థానాల‌ను వైసీపీ కైవ‌సం చేసుకోని.. ఇక్క‌డ హ‌వా సాగించిన పార్టీదే సీఎం పీఠం సంప్ర‌దాయం కొన‌సాగించింది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ మ‌ధ్య హోరాహెరి పోరు జ‌రిగితే.. రానున్న ఎన్నిక‌ల్లో మాత్రం ముక్కోణ పోటి జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలోనూ ఆవిష‌యం తేట‌తెల్ల‌మ‌య్యింది.ఇంత‌కు ఏపార్టీ ఎన్ని సీట్లు…

Read More

జగన్ రెడ్డి చేసిన మోసాలపై బీసీ సోదరులు ఆలోచన చేయాలి: నాదెండ్ల మనోహర్

బీసీలను 56 సంఘాలుగా విడదీసి వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన కార్పోరేషన్లు కేవలం స్టిక్కర్లు వేసుకుని టోల్ గేట్ల వద్ద గొడవలుపడడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని ఎద్దేవ చేశారు. సీఎం జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చేసిన మోసంపై ప్రతి బీసీ సోదరుడు ఆలోచన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుల గణన, తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల…

Read More

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్

మచిలీపట్నం వేదికగా మార్చి 14న జరగనున్న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. ప్రధాన వేదిక, డీ జోన్, వీర మహిళలు, మీడియా కోసం ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించిన అనంతరం.. సభకు హాజరయ్యే ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా చూడాలని నాయకులకి సూచించారు. పనులు మరింత వేగంగా పూర్తి చేయాలన్నారు. జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణం వద్ద పెడన, తిరువూరు నియోజకవర్గాలకు…

Read More

తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’

Nancharaiah merugumala: (senior journalist)  =================== ‘మద్యం మనుషులను కలుపుతుందా? తెలుగోళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ‘మద్యం బిజినెస్’లో కలిసే ఉన్నారా?’ మద్యం ..అదే.. మందు మనుషులందరినీ కలుపుతుంది. భావసారూప్యత ఉన్నోళ్లను ఒక చోట జమ అయ్యేలా పురికొల్పుతుంది. తెలుగునాట సారా పారిన 1970లు, 80లు, 90ల్లో కేశపల్లి గంగారెడ్డి, ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, ఏ.బసవారెడ్డి, నర్సారెడ్డి, టీ.బాలా గౌడ్ వంటి తెలంగాణా రెడ్లు, గౌడ వ్యాపారులు–మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, కంచి రామారావు, ఆకుల బుల్లబ్బాయి వంటి…

Read More

APPOLITICS: ఆర్ధిక మంత్రి బుగ్గన పై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ సెటైర్లు

విజయవాడ:  ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ సెటైర్లు పేల్చారు. సీఎం జగన్ పై ఆర్ధిక మంత్రికి బాగా నమ్మకం ఉన్నట్లు ఉందన్న ఆమె..జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని మండిప‌డ్డారు. భవిష్యత్ లో ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది వస్తుందని ముందే గ్రహించారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో ఎవరికి జీతాలు రాకపోయినా… ఆర్ధిక మంత్రి గారు మాత్రం టoచన్ గా జీతం తీసుకుంటున్నారని అన్నారు. తిరిగి…

Read More
Optimized by Optimole