వంద మంది ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌లు, అసదుద్దీన్‌ ఒవైసీలు భారతీయ ముస్లిం సమాజానికి అవసరం కాదా?

Nancharaiah merugumala senior journalist: షాబానూ కేసులో సుప్రీంకోర్టు తీర్పును రద్దుచేయడానికి నాటి రాజీవ్‌ గాంధీ సర్కారు ప్రయత్నించినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి 1986లో రాజీనామా చేశారు ప్రగతిశీల, సంస్కరణవాద ముస్లిం నేత ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌. కాంగ్రెస్‌ ప్రధాని రాజీవ్‌ అప్పుడు ముస్లిం ఛాందసవాదుల మాట విని అభివృద్ధి నిరోధకమైన ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణ బిల్లును చట్టంగా చేయించారు. పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌ బులందశహర్‌ కు చెందిన ఆరిఫ్‌ దీనికి నిరసనగా కేంద్ర కేబినెట్‌…

Read More

పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత..

Karnatakaelections2023: కర్ణాటకలో మరో మూడు రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీకి స్వల్ప ఆధిక్యత కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ.. కర్ణాటకలో తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్ సంస్థ చేపట్టిన ప్రీపోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి…

Read More

పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?: నాదెండ్ల మనోహర్

Janasena: • వసతి దీవెన, విద్యా దీవెన బటన్లు నొక్కినా నిధులు ఇవ్వలేదు • విద్యార్థుల సరిఫికెట్లు నిలిపివేస్తున్నా పట్టని వైసీపీ సర్కార్ • వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు జనసేన నాదెండ్ల మనోహర్. వైసీపీ తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు..  ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు….

Read More

రైతులకు అండగా జనసేన నిలుస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా…

Read More

తిరుమల తిరుపతి పవిత్రతను జనసేన కాపాడుతుంది: నాగబాబు

Janasena:వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో అక్రమంగా దోచుకున్నదంతా జనసేన ప్రభుత్వంలో కక్కిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. వైసీపీ నాయకుల ధన దాహానికి అపవిత్రమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలను జనసేన పాలనలో సరిదిద్దుతామని వెల్లడించారు. స్వార్థపరమైన జీ.ఓ.లు, ఏకపక్ష నిర్ణయాలపై పునః పరిశీలన చేపడతామని అన్నారు. తిరుపతి నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో బుధవారం జరిగిన “వర్చువల్” సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల…

Read More

ప్రజా సమస్యల కోసం కృషి చేసే నాయకుడిని: కోటంరెడ్డి శ్రీధర్

NelloreRural: ఐదేళ్లకోసారి కనిపించే నాయకున్ని కాదని..నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై కృషి చేసే నాయకుడినని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంగళవారం ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఇక ఏ మాత్రం అధికార పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి…

Read More

రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి

APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం…

Read More

అకాల వర్షాలతో కుదేలైన రైతులను ప్ర‌భుత్వం ఆదుకోవాలి : జ‌న‌సేనాని

janasena: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందని వాపోయారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని సమాచారం అందుతోందన్నారు. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారని.. వారికి అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని…

Read More

ఒంట‌రిగా విప‌క్షాలు బీజేపీని ఓడించేంత‌ సీన్ లేదు..

” కాన్పు ఎప్పుడో తెలీదు, దేశంలో విపక్ష ఐక్యతకు పురుటినొప్పులొస్తున్నాయి. కేంద్రంలో ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం పోయి, రాజ్యాంగ భద్రతా దేశ రక్షణకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలనే నినాదం బలపడుతోంది. ప్రస్తుత అనైక్యతా పరిస్థితి ఇలాగే కొనసాగితే… విపక్షాల రాజకీయ మనుగడ ప్రమాదమని పార్టీలు ఒకటొకటిగా గ్రహిస్తున్నట్టుంది. అందుకే… నదులన్నీ సముద్రం వైపు సాగే తరహాలో ఐక్యతాయత్నాలు ఒక కేంద్రకం వైపు బలపడుతున్నాయి. అది ఓ కొలిక్కి రావటమన్నది కొన్ని పరిస్థితులు, పరిణామాలు, ఫలితాలపై ఆధారపడనుంది. కాంగ్రెస్‌…

Read More

వైసీపీకి సుపరిపాలన చేతకాదు: నాదెండ్ల మనోహర్

Janasena: * ఎన్నికల సమరానికి ప్రణాళికతో సిద్ధమవుదాం * గాజువాక నియోజకవర్గం పార్టీ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  ప్రజా వ్యతిరేక పాలన నిర్ణయాలను జనసేన పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్  నాదెండ్ల మనోహర్. సోమవారం గాజువాక నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో  మనోహర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  “సుపరిపాలన అనేది వైసీపీకి తెలియదన్నారు. అరాచకాలు …

Read More
Optimized by Optimole