మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు.. ట్రాఫిక్ అంతరాయం..

సమక్కసారక్క: మేడారం జనసంద్రంగా తలపిస్తోంది. మహజాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విరసిల్లుతున్న తల్లులను తనివితీరా కొలిచేందుకు భక్తులు బారులు దీరుతున్నారు. తెలంగాణా నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ప్రజలు వన దేవతల దర్శనానికి తరలివస్తున్నారు.

కాగా  భక్తుల రద్దీతో  ఆదివారం మేడారం పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. జంపన్న వాగు నుంచి చింతల్ x రోడ్డు వరకు రద్దీ కొనసాగుతోంది. పోలీసుల ఆధ్వర్యంలో వాహనాల తరలింపు ప్రక్రియ కొనసాగుతున్నది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.