నేటి సమాజంలో పిల్లలు చేతికి మొబైల్ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ఫోన్లో గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. అలాంటి ఓ పిల్లాడు తండ్రి మొబైల్ లో గేమ్ ఆడూతూ ఏకంగా రూ.39 లక్షలు పొగొట్టాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది.
ఆగ్రాలోని తాజ్నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి ఫోన్లో తరుచూ గేమ్స్ ఆడూతుండేవాడు. ఆడిన ప్రతిసారీ ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. ఈక్రమంలో తండ్రి ఓ రోజు బ్యాంక్ ఖాతాలో డబ్బులు చెక్ చేయగా 39 లక్షలు మాయమైనట్లు గుర్తించాడు. వెంటనే దీనిపై ఆగ్రా రేంజ్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి బ్యాంకు ఖాతా ఆధారంగా విచారణ చేపట్టగా.. సింగపుర్లోని క్రాఫ్టన్ ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. విశ్రాంత సైనికుడి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.