సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్షతను చేరిపేస్తూ..మహిళ అబల కాదు సబల అని నిరూపించి..రాజకీయాలకు అతీతంగా అందరి అభిమానాన్ని చూరగొన్న మహిళ నేతల్లో ఒకరైన బిజిప్ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ జయంతి సందర్భంగా ఆ మహానీయురాలి స్మృతిలో..
హర్యానా రాష్ర్టంలోని కంబోలా స్వస్థలం.. 1953 ఫిబ్రవరి14 న సుష్మాస్వరాజ్ జన్మించారు.తల్లిదండ్రులు హరిదేవ్ శర్మ లక్ష్మీదేవి.వీరి కుటుంబం దేశ విభజనకు ముందు లాహోర్ లో ఉండేవారు.తండ్రి హరిదేవ్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త..వారసత్వంమే సుష్మ జి పాటించారు.విద్యాబ్యాసం అంత అక్కడే గడిచింది..పాఠశాల కళాశాలలో ఉత్తమ విద్యార్థినిగా పేరుతో పాటు..రాజనీతి సంస్కృతంలో బి.ఎ.పూర్తి చేసి..పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్రంలో పట్టభద్రులైనారు.
రాజకీయ రంగ ప్రవేశం..
సుష్మ స్వరాజ్ విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుడినారు..విద్యార్థి సంగం నాయకురాలిగా అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. అక్రమంలోనే 1977 తొలిసారి శాసన సభకు ఎన్నికయ్యారు.
1975 లో తన సహచర న్యాయవాది స్వరాజ్ కౌశల్ తో వివాహం జరిగింది.అనంతరం 1996 1998లో వాజ్పయ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.1998లో ఢిల్లీ ముఖ్యమంత్రి గా బాధ్యతలు నిర్వహించారు.1999లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పై బళ్లారిలో పోటీ చేసి ఓడిపోయారు.
వాజ్పయ్ మంత్రివర్గంలో 2000 నుంచి 2003 వరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.2004లో ఉత్తరఖండ్ నుంచి రాజ్యసభ కు ఎన్నికయ్యారు.2014 ప్రధాని నరేంద్రమోడీ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు.ఆరోగ్య రీత్యా 2019 లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
తెలంగాణ చిన్నమ్మా..
ప్రత్యేక తెలంగాణా ఏర్పాటులో సుష్మ స్వరాజ్ పాత్ర మరువలేనిది.పార్లమెంట్ లో బిల్లు పాస్ కావడంలో ఆమె కృషి వెలకట్టలేనిది.బిల్లు పాస్ అనంతరం ప్రసంగిస్తూ ‘తెలంగాణ చిన్నమగా గుర్తుపెట్టుకోవలని తెలంగాణ ప్రజలను ప్రేమతో కోరారు’
రాజకీయాలకు అతీతంగా ఎందరో మనసులను గెలుచుకొని తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఐరన్ లేడి ‘సుష్మాస్వరాజ్’ భౌతికంగా దూరమై ఏడాది కావొస్తున్నా ఆమె స్మృతులు మాత్రం చిరస్మరణీయం