కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు: కేంద్ర మంత్రి షేకావత్

కేసిఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారు: కేంద్ర మంత్రి షేకావత్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో నెల‌కొన్ని జల వివాదంపై స్పందించారు కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల కారణంగానే ట్రిబ్యున‌ల్ ఏర్పాటులో జాప్యం జ‌రుగుతోంద‌న్నారు. సీఎం కేసిఆర్ ప్రెస్ మీట్ పెట్టీ అవాస్తవాలు మాట్లాడారాన్నరు. 2015లో కొత్త ట్రిబ్యునల్ ఎర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు.కావాల‌నే కేంద్రాన్ని కేసీఆర్ బ‌ద్నాం చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. ఇరు రాష్ట్రాల అంగీకారం త‌ర్వాతే ట్రిబ్యున‌ల్ ఏర్పాటు జ‌రుగుతుందన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం 2020లో నిర్వహించానని.. 2020 , 6 అక్టోబర్ లో సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ ను..రెండు రోజుల్లో వెనక్కి తీసుకుంటానన్న కేసీఆర్ …8 నెలల తర్వాత కేసును ఉపసంహరించుకున్నారని చెప్పారు. నెల రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇచ్చిందని..దీంతో కేంద్రం జల వివాదంపై పని మొదలు పెట్టిందని పేర్కొన్నారు. రాష్ట్రం చేసిన ఆలస్యానికి మమ్మల్ని ఎలా  బాధ్యులను చేస్తారని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కేసీఅర్ మాటలు ప్రజాస్వామ్యన్ని అపహస్యం చేసేలా మాట్లడారన్నారు. కేసీఆర్ బాధ్యత గల పదవిలో ఉండి ఇలా మాట్లాడటం మంచిది కాదన్నారు.