దేశంలో మరోసారి కోవిడ్ కోరలు చాస్తోంది. గత వారం రోజులుగా కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 17 వేల 73 కేసులు నిర్థారణ అయ్యాయి. మహమ్మారితో 21 మంది చనిపోయారు. కరోనా నుంచి 15 వేల 2 వందల 8 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.57 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివవ్ కేసుల సంఖ్య 94 వేల 420 గా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో అధికారులు టీకాల పంపిణీని వేగవంతం చేశారు. నిన్న ఒక్కరోజే 2,49,646 మందికి టీకాలు అందించారు.దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,97,11,91,329 కోట్లకు చేరింది.