×

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టిఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి బిజెపిలో చేరనున్నట్లు పార్టీ నేతల ద్వారా తెలిసింది. ఉప ఎన్నికలో సీటు ఆశించి భంగపడ్డ బూర.. కొద్ది రోజుల క్రితం బాహటంగానే మంత్రి జగదీశ్వర్ రెడ్డి పై విమర్శలు చేశారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాల పట్ల అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చివరాఖరికి సీఎం కేసిఆర్ బుజ్జగింపు ప్రయత్నాలు చేసిన తీవ్ర అసహనంతో ఉన్న బూర పార్టీ మారాలని డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

బూర పార్టీ మార్పుకు మంత్రి జగదీష్ వైఖరే కారణమా..?

మునుగోడు నియోజకవర్గంలో బూర నర్సయ్యకు అందరివాడిగా పేరుంది.పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించేవారున్నారు. దీనికి తోడు ఆయన చేపట్టినటువంటి సేవ కార్యక్రమాలు ఆయన ఇమేజ్ కి మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రజల్లో మాత్రం ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు. అయితే మునుగోడు ఉప ఎన్నిక దృష్ట్యా ఆయన సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. నియోజక వర్గంలో బీసీ సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉండటం.. కూసుకుంట్లకు సొంత పార్టీ నేతల్లోనే వ్యతిరేకత ఉండటంతో సీటు తమ నేతకే వస్తుందని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డి..కూసుకుంట్లకు మద్దతుగా నిలవడం.. పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడం వంటి విషయాలు.. బూర ,అతని  అనుచరులకు రుచించలేదు.దీంతో  బూర మంత్రి టార్గెట్ గ బాహాటంగానే  విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఉద్యమ నేతలమని పదవులు చూసి విర్రవీగే వాళ్ళ పరిస్థితి ఏంటో మన్నన చేసుకోవాలి అంటూ  చురకలంటించారు. తనకు కేసిఆర్ మాత్రమే నాయకుడు అంటూ తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం కేసిఆర్.. అతన్ని స్వయంగా పిలిచి బుజ్జ గించే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ మంత్రి వైఖరిలో మార్పు కనిపించక పోవడంతో పార్టీ వీడెందుకు సిద్ధమయ్యారు.

ఇక బూర పార్టీ మార్పుకు వినిపిస్తున్న మరో బలమైన కారణం.. ఉప ఎన్నిక నామినేషన్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామని నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఈ కార్యక్రమంలో బూర కనిపించినప్పటికీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అతనికి సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదన్నది అతని వర్గీయుల మాటగా వినిపిస్తోంది. దీంతో చేసేదేమీ లేక బూర బీజేపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 

అమిత్ షా సమక్షంలో బీజేపీ లో చేరే అవకాశం..?

మాజీ ఎంపి బూర నర్సయ్య ఆయన అనుచరులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీ చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో ఉన ఆయన.. ఇప్పటికే బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే ఉప ఎన్నిక వెళ బూర చేరిక బీజేపీ కి మంచి బూస్టప్ అని చెప్పవచ్చు. నియోజకవర్గంలో బీసీ ఓట్లన్నీ గంపగుత్త గా పడటం ఖాయమన్న ప్రచారం  ఇప్పటికే ఊపందుకున్న నేపథ్యంలో కాషాయం నేతలు క్యాష్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

మొత్తంమీద బూర ఎంట్రీతో ఇటు టీఆర్ఎస్ నేతల్లో కలవరం మొదలవగా..అటు బీజేపీ నేతల్లో  జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండంగా భావిస్తున్న ఉప ఎన్నికలో విజయం సాధించి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని కమలం నేతలు ఉవ్విళ్లరుతున్నారు.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all
Optimized by Optimole