Telangana: సోదరభావానికి నిలువెత్తు నిదర్శనమే రాఖీ పౌర్ణమి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో గొప్ప ఆచారమని పేర్కొన్నారు. ప్రజల మధ్య సోదరభావం మరింతగా ఫరిడవిల్లాలని ఆకాంక్షించారు.
సోదరభావంతో ప్రేమానురాగాలతో ప్రతి సంవత్సరం శ్రావణమాసం పౌర్ణమి నాడు, రాఖీలు కట్టుకుంటూ జరుపుకునే రాఖీ పండుగ, భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల్లో అనాది నుంచి కొనసాగుతున్న గొప్ప ఆచారమని పేర్కొన్నారు. రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజల నడుమ సహోదర భావం మరింతగా పరిడవిల్లాలని మంత్రి ఆకాంక్షించారు.రక్షాబంధన్ వేడుకల సందర్భంగా ప్రజలకు జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.