ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!

ప్రజాదరణలో లోక ‘ నాయకుడు’ మోదీ..!

ప్రధాని మోదీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్ భారతావని మరోసారి ఆయన నాయకత్వం  కావాలని కోరుకుంటున్నట్లు  వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది.తాజాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలోనూ అదే విషయం తేటతెల్లమైంది. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా మోదీ మొదటి స్థానంలో నిలిచినట్లు సంస్థ ప్రకటించింది. 22 మంది ప్రపంచ నాయకులపై సంస్థ సర్వే నిర్వహించగా..76 శాతం రేటింగ్ తో గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మోదీ తొలి స్థానంలో.. మెక్సికో ప్రెసిడెంట్ అండ్రెస్ 61 శాతంతో రెండో స్థానంలో  నిలిచారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ 41%తో ఏడో స్థానానికి పరిమితమయ్యారు. భారత సంతతికి చెందిన బ్రిటన్ ప్రధాని సునాక్ 34 శాతంతో 13 వ స్థానంలో నిలచినట్లు సర్వే సంస్థ వెల్లడించిది.

కాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్లోబల్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్ లో మొదటి స్థానంలో నిలవడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశమే కాదు యావత్ ప్రపంచం.. మోడీ నాయకత్వాన్ని కోరుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అటు బిజెపి నాయకులు సైతం..మోడీ నాయకత్వానికి కొనియాడుతూ..లోక నాయకుడు మోదీ.. ‘జయ హో మోదీ ‘ ముచ్చటగా మూడో సారి ప్రధాని పీఠం మోదీదే.. ఇందులో ఎలాంటి సందేహం లేదంటూ పోస్టులతో రెచ్చిపోతున్నారు.