విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది, సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు.
కాగా ఈ చిత్రం వేసవి కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినినిమాకి ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ సంగీతం అందిస్తుండగా , ఛాయాగ్రాహకుడిగా శ్యామ్ కె.నాయుడు, కూర్పు మార్తాండ్ వెంకటేష్ పని చేస్తున్నారు.