కరోనా సెకండ్ వేవ్ కి తోడు ఫంగస్ లు జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న బ్లాక్.. వైట్..ఎల్లో ఫంగస్ జాబితాలో.. తాజాగా క్రీమ్ ఫంగస్ చేరింది. మధ్యప్రదేశ్ జబల్పుర్లో ఒక క్రీమ్ ఫంగస్ కేసు వెలుగుచూసింది. అయితే.. బ్లాక్, వైట్ ఫంగస్ల కంటే ఇది ప్రమాదకారి కాదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జబల్పుర్లో దాదాపు 150 మంది శీలీంద్ర వ్యాధుల కారణంగా ఆసుపత్రిలో చేరారు. వీరికీ జబల్పుర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో 100 మంది చికిత్స అందిస్తుండగా.. 50 మంది ఇతర ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.మరోవైపు, బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం వైద్య పరికరాలు, ఔషధాలను సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఔషధాల రవాణా కోసం హెలికాప్టర్లను ఉపయోగిస్తోంది.
కరోనా ఉధృతి అదుపులోకి వస్తున్న.. ఫంగస్ ల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని.. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచిస్తున్నారు.