కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేస్తున్నారు: సంజయ్
హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధుల కేటాయింపు వివరాలను ప్రజలకు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, వైఫల్యాలు, మోసాలు, కుటుంబ, అవినీతి పాలన గురించి ప్రజలకు వివరించారు. కేసీఆర్ కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. భారత జాతీయ ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం…