దేశంలో ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు..

సామాన్యుడికి ఒక్క‌రోజైనా ఊర‌ట‌నిస్తూ గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు కొన్ని ప్రాంతాల్లో శనివారం స్థిరంగా ఉన్నాయి. అయితే, దేశ‌వ్యాప్తంగా కొన్ని చోట్ల‌ ఇంధ‌నం ధ‌ర‌లు పెరిగినట్లు తెలుస్తొంది.
ఇక దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ 108 రూపాయ‌ల 64 పైస‌లు, అలాగే డీజిల్ 97 రూపాయ‌ల 37 పైస‌లుగా ఉంది. హైద‌రాబాద్‌లో నిన్న పెరిగి 113 రూపాయ‌లకు చేరుకున్న పెట్రోల్ ఈ రోజు అదే ధ‌ర‌తో స్థిరంగా ఉంది. డీజిల్ ధ‌ర కూడా 106 రూపాయ‌ల 22 పైస‌లుగా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు ప‌ట్ట‌ణాల్లో ఇంధ‌నం ధ‌ర‌ల‌ను గ‌మ‌నిస్తే… క‌రీంన‌గ‌ర్‌లో పెట్రోల్ 112 రూపాయ‌ల 95 పైస‌లు, డీజిల్ 106 రూపాయ‌ల 17 పైస‌లైతేజ… నిజామాబాద్‌లో పెట్రోల్ 114 రూపాయ‌ల 46 పైస‌ల‌కు చేరుకుంది. డీజిల్ 107 రూపాయ‌ల 58 పైస‌లుగా ఉంది. అయితే ఆదిలాబాద్‌లో నిన్న‌ 114 రూపాయ‌ల 88 పైస‌లున్న పెట్రోల్ ఈ రోజు 115 రూపాయ‌ల‌ను దాటి 115 రూపాయ‌ల 45 పైస‌ల‌కు చేరుకుంది. ఇక్క‌డ డీజిల్ కూడా 108 రూపాయ‌ల 50 పైస‌లుగా ఉంది. అలాగే నిర్మ‌ల్ జిల్లాలోనూ పెట్రోల్ 115 రూపాయ‌లు దాటింది.
ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ధ‌ర‌ల్ని ప‌రిశీలిస్తే, విజ‌య‌వాడ‌లో పెట్రోల్ 114 రూపాయ‌ల 57 పైస‌లుగా ఉంటే, డీజిల్ ధ‌ర 8 పైస‌లు పెరిగి 107 రూపాయ‌ల 21 పైస‌లుగా ఉంది. గుంటూరులో పెట్రోల్ 115 రూపాయ‌ల 27 పైస‌లుంటే… డీజిల్ 107 రూపాయ‌ల 86 పైస‌లు ఉంది. విశాఖ‌ప‌ట్నంలో పెట్రోల్ మ‌రో రూపాయి పెరిగి 114 రూపాయ‌ల 57 పైస‌ల‌కు చేరుకుంటే, డీజిల్ ధ‌ర కూడా పెరిగి ఈ రోజు 107 రూపాయ‌ల 15 పైస‌లుకు చేరుకుంది.

Optimized by Optimole