పరగ విద్య నేర్వ పండితుడై పోయి.. పూజ నీయుడౌను పుడమి యందు!!
గురుపూజోత్సవం సందర్భంగా తెలుగు వెలుగు సాహిత్య వేదిక జూమ్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సూర్యాపేటకు చెందిన కవయిత్రి నల్లాన్ చక్రవర్తుల రోజాదేవి..గురు పరబ్రహ్మ స్వరూపం శీర్షిక తో స్వీయ రచన చేశారు. గురుమూర్తులు అంశంతో వచ్చిన ఈ పద్యం ఆలోచింప చేసే విధంగా ఉంది. 1.బ్రతుకు తెరువు చూపు భగవంతుడీతడే చిత్తమందు నిలుచు చిన్మయుండు శ్వేత పత్ర మంటి శిష్యుని హృదయాన చిత్తరువయి చాలా సేవలందు 2.అమ్మ జన్మమిచ్చు, అయ్య నడకనేర్పు విద్య లెల్లగరపు విజ్ఞుడొకడె…