జగన్ తో షర్మిల ఢీ? ఏపి కాంగ్రెస్ కు ఆశాకిరణం..!
Appolitics : ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని తెలిసినా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రిస్క్ తీసుకొని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో రాష్ట్ర విభజనకు పూనుకున్నారు. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ రాజకీయంగా ఎంతో నష్టపోయింది. రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రజల ఆగ్రహంతో ఏపీలో కాంగ్రెస్ పునాదులే కూలిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం కలలను సాకారం చేసుకున్న తెలంగాణలో కూడా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి తొమ్మిదిన్నరేళ్లు పట్టింది. దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణలో…