National: బీజేపీకి అన్నామలై గుడ్‌బై…!

Chennai: తమిళనాడు రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా బీజేపీకి ప్రధాన ముఖచిత్రంగా నిలిచిన కె. అన్నామలై పార్టీకి రాజీనామా చేయడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, తమిళనాడులో బీజేపీ విస్తరణ కోసం దూకుడుగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వంతో నెలలుగా కొనసాగుతున్న విభేదాలు చివరకు ఆయన నిష్క్రమణకు దారితీశాయి. అన్నామలై సమర్పించిన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆమోదించగా, దీనికి సంబంధించిన అధికారిక…

Read Full News

National: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి..

National: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సువేందు అధికారిని పార్టీ శాసనసభా పక్షం అధికారికంగా ఎన్నుకుంది. కోల్‌కతాలోని విశ్వబంధు కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన ఈ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్ సువేందు అధికారి పేరును సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించగా, శాసనసభా…

Read Full News

National: కేరళలో యూడీఎఫ్ సర్కార్: పీపుల్స్ పల్స్

National: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్‌డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్‌డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో…

Read Full News

National: తమిళనాడులో మ‌రోసారి డీఎంకే…

National: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదయ్యింది. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యింది.తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా…

Read Full News

Telangana: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా: పీపుల్స్ పల్స్

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యం సాధించే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సర్వే అంచనా వేసింది. కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలిచే…

Read Full News

Assamelections2026: అస్సాంలో హ్యాట్రిక్ విజయం దిశగా బీజేపీ: పీపుల్స్ పల్స్

Assamelections2026: ఈ ఏడాది జరగబోయే అస్సాం శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) వరుసగా మూడోసారి అధికారాన్ని సాధించే దిశగా దూసుకెళ్తోందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన తాజా ట్రాకర్‌ పోల్‌ వెల్లడిరచింది. 2025 నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు నిర్వహించిన ఈ సర్వే ప్రకారం, మొత్తం 126 స్థానాలు ఉన్న శాసనసభలో బీజేపీ 69-74 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించే అవకాశముంది. ఎన్‌డీఏ భాగస్వాములతో కలిపితే మొత్తం సీట్లు 90…

Read Full News

Apnews: The Politics of ‘Gold-Plating’ Governance

Apnews: Governance is ultimately about intent, integrity, and outcomes. Achieving stated objectives and fulfilling public promises require administrative commitment and political will not cosmetic alterations. What, after all, is achieved by merely changing names? How does it benefit citizens? Of late, a peculiar obsession appears to have gripped those in power: the belief that renaming…

Read Full News

vandematram: వందేమాతరం దేశ సమైక్యతకు ప్రతీక..!!

Vandematram: భావోద్వేగాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వచ్చిన బీజేపీ సున్నితమైన అంశాలతో రాజకీయాలు చేస్తోంది. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ పార్టీని లక్ష్యంగా చేసుకొని చరిత్రను వక్రీకరించడంలో దిట్ట అయిన బీజేపీకి భారత స్వాతంత్రోద్యమంలో ఎలాంటి భాగస్వామ్యం లేదనేది వాస్తవం. స్వాతంత్య్ర సమరయోధులు మహాత్మా గాంధీ, పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ వంటి మహా నేతల మధ్య విభేదాలున్నట్టు అసత్య ప్రచారం చేసిన బీజేపీ ఇప్పుడు పార్లమెంట్‌ వేదికగా ‘వందేమాతరం’…

Read Full News

Apnews: కౌలు రైతుల సమస్యలు పట్టని ప్రభుత్వాలు…!!

Apnews: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అవశేష ఆంధ్రప్రదేశ్లో కౌలురైతులను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అత్యధిక శాతం మంది కౌలురైతులు భావిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం, పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ కలిసి నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడైంది. కౌలురైతుల సమస్యలను ఏరాజకీయపార్టీ పట్టించుకోవట్లేదని 92.1 శాతం మంది కౌలురైతులు తెలుపగా, పట్టించుకుంటున్నారని కేవలం 6.1, తెలియదని 1.9 శాతం మంది తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతుల సమస్యలపై 20 సెప్టెంబర్ నుండి 20 అక్టోబర్ వరకు ఒక నెలరోజులపాటు…

Read Full News

Apnews: జాతీయపార్టీల పతనం ఏపీ ప్రజలకు శాపం..!

APpolitics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జాతీయ పార్టీల బలహీన స్థితి, ప్రాంతీయ శక్తుల్ని బలోపేతం చేయడమే కాకుండా కుల రాజకీయాలకు దోహదమవుతోంది. పలు వికారాలకు ఇదొక ముఖ్య కారణంగా నిలుస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా అధికారంలోకి వచ్చే ప్రాంతీయ శక్తుల పాలనలో ఇష్టానుసారంగా నడచుకోవడంతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వాతావరణమే క్షీణిస్తోంది. సిద్దాంత బలం, విధానాల నిబద్దత లేని ప్రాంతీయ శక్తులు గద్దెనెక్కిన నుంచి నిరంతరం ఆధిపత్య సాధన, ప్రత్యర్థుల అణచివేత పైనే దృష్టి పెట్టడం ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది….

Read Full News
Optimized by Optimole