మరోసారి బ్లాక్ ఫంగస్ కలకలం.. యూపీ లో తొలి కేసు!
దేశంలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. రోజువారిగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ హడలెత్తిస్తోంది. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇవి చాలదన్నట్లు.. బ్లాక్ ఫంగస్ సైతం మరోసారి కలకలం రేపుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. కాంట్ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి బ్లాక్ ఫంగస్ సోకిందని జీఎస్వీఎం ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. బాధితుడి ఒక…