కేసిఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి_ బండి సంజయ్
రాజ్యాంగాన్ని తిరిగి రాయాలన్న సీఎం కేసీఆర్పై దేశద్రోహం కేసుపెట్టాలన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. మంగళవారం మీడియాతో మాట్లాడిన సంజయ్.. కేసిఆర్ పై ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ అంబేడ్కర్ను కేసీఆర్ అవమానించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మర్చాలనడం వెనక ఉద్దేశ్యం ఏంటో తెలపాలన్నారు. కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన కుంభకోణాల్ని బయటికి తీయబోతున్నామన్నారు. త్వరలో ఆయన అరెస్ట్ ఖాయమని తెలిసే.. ప్రజల్లో సానుభూతి కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. దళితుడైనందుకే…