కాళేశ్వరంపై తగ్గేదే లే అంటున్న బీజేపీ నేతలు..
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని బిజెపి జాతీయ నాయకత్వంతో పాటు.. రాష్ట్ర నాయకత్వం గత కొన్ని రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తోంది. సీఎం కేసిఆర్ కి కాళేశ్వరం ఎటిఎం గా మారిందని బీజేపీ నేతలు వివిధసభల్లో బహిరంగంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్.. కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను పక్కా ఆధారాలతో ప్రజాకోర్టులో దోషిగా నిలబెట్టెందుకు …