cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో సినీ పాత్రికేయులు, ప్రముఖులు పాల్గొని ఆయన సినీ, సామాజిక సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తన జీవిత ప్రయాణంలో తనకు దారి చూపిన నలుగురు వ్యక్తులను ఎప్పటికీ మరువలేనన్నారు. నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు, గుప్త మాణిక్యాలరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు,…
