Telangana: తెలంగాణలో ఏసీబీ దూకుడు..

Telangana: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు చూపిస్తోంది. ఇటీవల ఈశాఖ వలలో చిక్కుకుంటున్న అధికారులు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. గత ఆరు నెలల్లోనే ఏసీబీ మొత్తం 122 ట్రాప్ కేసులను నమోదు చేసింది. అంటే, నెలకు సగటున 20 కేసులకుపైగా లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది మొత్తం 129 ట్రాప్ కేసులు నమోదయ్యాయి. కానీ ఈ ఏడాది ఆరు నెలలు గడవకముందే ఆ సంఖ్య దాటి…

Read More

Tollywood: విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..!

Tollywood: ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాల ఫిర్యాదు మేరకు విజయ్ పై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “500 సంవత్సరాల క్రితం ట్రైబల్స్ (గిరిజనులు) కొట్టుకున్నట్లు…..

Read More

Telangana: కేసీఆర్ బాటలో కవిత..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధనే లక్ష్యంగా పెట్టుకున్న కేసిఆర్ “ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు ఎవరినైనా కలుస్తాను… అవసరమైతే గొంగళిపురుగునైనా ముద్దాడతాను” అంటూ పదేపదే ప్రకటించి, ఆ దిశగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అదే బాటలో నడుస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. లిక్కర్ స్కాంలో బెయిల్ పై విడుదలైన అనంతరం కొంతకాలం మౌనంగా ఉన్న ఆమె, తాజాగా బీసీలకు…

Read More

Telangana: “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తకావిష్కరణకు రంగం సిద్ధం..!!

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర ప్రజాపాలనలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల విశేషాలను.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రానికి తలెత్తిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ వివిధ పత్రికలకు రాసిన వ్యాసాల సంకలనం “విధ్వంసం నుంచి వికాసం వైపు” పుస్తక రూపంలో వెలువడుతోంది.  ఇక ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో జరగనున్న టీపీసీసీ తొలి ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి…

Read More

karimnagar: ఫోన్ ట్యాపింగ్ తో కేసిఆర్ అనేక మంది జీవితాలను నాశనం చేశారు: బండి సంజయ్

కరీంనగర్: తెలంగాణ రాజకీయాల్ని ఊగిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ పాలనలో అనేక మంది జీవితాలు నాశనం అయ్యాయనీ, ఫోన్ ట్యాపింగ్ పేరుతో స్వేచ్ఛను హరించారని” ఆయన ఆరోపించారు. సిరిసిల్లను కేంద్రంగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ కార్యచరణ సాగిందని బండి సంజయ్ తెలిపారు. “దీనికి వెనుక ఎవరు ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. అనేక మంది బాధితులు ఉసురు పోసుకున్నారు. ఈ…

Read More

APpolitics: అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడేవారిని ప్రజలు ఓ కంట కనిపెట్టాలి: పవన్ కళ్యాణ్

APpolitics: సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాలు వరకూ బాగుంటాయి. వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగులకు అనుగుణంగా ప్రవర్తిస్తాము అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. ఎవరైనా చట్టం, నియమనిబంధనలను పాటించాల్సిందే. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ప్రభుత్వం ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని ఉపేక్షించదు. కచ్చితంగా అలాంటివారిపై రౌడీ షీట్లు తెరిచి… అసాంఘిక శక్తులను అదుపు చేస్తాము. అశాంతిని, అభద్రతను…

Read More

Hyderabad: అర్చకుల జీవితాల్లో ఆశలు నింపిన మంత్రి కొండా సురేఖ..

హైద‌రాబాద్‌: దేవాదాయ శాఖలో కొన్ని సంవత్సరాల తరబడి పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగుల జీవితాల్లో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆశలు నింపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న దేవాయాల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చ‌కుల దీర్ఘకాలిక కోరిక‌ను నెరవేర్చారు. అన్ని ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చ‌క‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్ర‌త్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. అయితే, గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌, ఎండోమెంటు డైరెక్ట‌ర్ వెంక‌ట‌రావు తదిత‌ర అధికారుల‌తో…

Read More

Hyderabad: ఆర్టీసీ తొలి ఉమెన్ డ్రైవ‌ర్ స‌రిత ఎంతోమందికి ఆద‌ర్శం: మంత్రి సురేఖ

హైద‌రాబాద్ః తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్‌ డ్రైవర్‌గా చేరిన సరిత, ఈ దేశంలోని ఎంతోమంది మ‌హిళ‌ల‌కు ఆదర్శమ‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. గురువారం డ్రైవ‌ర్ స‌రిత‌, మంత్రి సురేఖ‌ను వారి జూబ్లీహిల్స్‌ నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సందర్భంగా సరితను శాలువాతో మంత్రి ఘ‌నంగా సత్కరించారు. రానున్న రోజుల్లో మ‌రింత రాణించాల‌ని మంత్రి అభిలాషించారు. ఈ నేప‌థ్యంలో స‌రిత త‌న కుటుంబ స‌మ‌స్య‌లు మంత్రి సురేఖ‌కు నివేదించ‌గా, ఎటువంటి…

Read More
Optimized by Optimole