newsminute24
EEnadu: తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!
Nancharaiah merugumala senior journalist: 1982లో తెలుగోళ్లకు రాజకీయ ప్రత్యామ్నాయం టీడీపీ అందించినట్టే వారికి సమగ్ర తెలుగు పత్రిక ఎలా ఉండాలో ‘ఈనాడు’ ఆచరణలో చేసి చూపించింది!సిబ్బందికి చెప్పిన రోజే జీతాలిచ్చే పత్రిక ‘హిందూ’లా వందేళ్లు దాటి బతుకుతుంది… 1974 చివర్లో కృష్ణా జిల్లా ఉప్పలూరుకు చెందిన మా అమ్మ సంపూర్ణం (ఆమెది పక్కనున్న పునాదిపాడు) చిన్నాన్న (చిన్నాయనమ్మ పెద్ద కొడుకు) కామ్రేడ్ లోయ కనక బసవారావు గారు గుడివాడ నాగవరప్పాడు రోడ్డులోని మా ఇంటికి వచ్చాడు….
EENADU: ‘ఈనాడు’ అక్షరం, రేపటికి గవాక్షం..!
ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: యాభయ్యేళ్లు, అంటే… అర్థశతాబ్ది చరిత్ర ఈ మూడక్షరాలు! ఈనాడు తెలుగు సమాజంతో అయిదు దశాబ్దాలు నిండుగా మమేకమైన దినపత్రిక. సమాచారం, సందేశం, జ్ఞానం, వినోదం, వికాసం, చేతన, ప్రేరణ, సంస్కృతి, సహాయం, సాహిత్యం, భాష, బంధం…. ఒకటేమిటి? ఇలా లెక్కలేనన్ని విధాలుగా తోడ్పడుతూ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకున్న అక్షరాల అనుబంధం ఈనాడు. దీర్ఘకాలిక వ్యూహం, పక్కా ప్రణాళికతో… యాబై యేళ్ల కింద, సరిగ్గా ఇదే తేదీ (ఆగస్టు 9)న,…
Pandian: న్యాయం కోసం చేతిని నరికేసుకున్న రాజు కథ తెలుసా…??
విశీ(వి.సాయివంశీ): క్రీస్తు పూర్వం 100-120 మధ్య పాండియన్ అనే రాజు పాండ్య రాజ్యాన్ని పాలించారు. ఆయనది చాలా నీతివంతమైన పాలన అని పేరు. నీతి, న్యాయం కోసం ఎంత సాహసానికైనా సిద్ధపడే తత్వం ఆయన సొంతం. ఆయన రాత్రుళ్ళు మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన మారువేషంలో నగరంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక ఇంటి నుంచి ఆడ, మగ గొంతులు వినిపించాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు. ఆ భర్త ఏదో దూర దేశానికి ఆ రాత్రే ప్రయాణమై…
Bhattacharya: అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగేస్తారా..ఛీ..!
Nancharaiah merugumala senior journalist: ‘కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తే అమరవీరుల స్తూపానికి ఎర్ర రంగు వేస్తారా,’ అని సీపీఎం చివరి సీఎం బుద్ధదేవ్ను ఎత్తిపొడిచిన సత్యజిత్ రే! పశ్చిమ బెంగాల్ రెండో మార్క్సిస్టు ముఖ్యమంత్రి, రాష్ట్ర రెండో బ్రాహ్మణ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య 80 ఏళ్ల వయసులో గురువారం కన్నుమూయడం దేశంలో కమ్యూనిస్టు సానుభూతిపరులకు పెద్ద విషాదం. నిజాయితీకి, నిబద్ధతకు మారుపేరైన కామ్రేడ్ బుద్ధదేవ్ బెంగాల్లో కమ్యూనిస్టు పాలనకు తన అనాలోచిత పాలనా విధానాలతో పాతరేశాడనే చెడ్డ…
VineshPhogat: 140 కోట్ల హృదయాలు గెలిచిన విజేతవు.. నీవు ‘ జగద్విజేతవు’..!
ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…? ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వీధి మలుపు జంతర్-మంతర్ లో కూడా ఏకరీతిన పోరాడే మొక్కవోని మనోదైర్యాన్నీ, జరిగిన అవమానాలన్నింటికీ జవాబుగా పతకం గెలిచి తీరాలన్న సడలని పట్టుదలని ఒక భుజాన ఒలంపిక్ గ్రామానికి మోసుకొచ్చిందామె! మరి, బరువు పెరగదా? మరొ భుజానేమో…. అధికారం, మందపు పొరై కళ్లను కప్పేసిన అంధకారంలో కనిపించకుండా పోయిన…
Modi: ‘ప్రధానిగా మోదీ అవతరణ’ పై ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Nancharaiah merugumala senior journalist: వాజపేయి, ఆడ్వాణీలు ‘ప్రధానిగా మోదీ అవతరణ’కు అనువైన వాతావరణం సృష్టించారన్న అసదుద్దీన్ ఒవైసీ మాటల్లో నిజం ఉందేమో..! ‘‘ జర్మనీలో యూదు వ్యతిరేకతను ఫ్యూరర్ అడాల్ఫ్ హిట్లర్ కొత్తగా సృష్టించలేదు. అప్పటికే జర్మన్ సమాజంలో యూదులంటే ద్వేషం ఉంది. అలాగే, ఇండియాలోనూ చాప కింద నీరులా ఇలాంటి భావనలే (ముస్లింలంటే వ్యతిరేకత లేదా ద్వేషం అనే అర్ధంలో) జనంలో ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిని మనం ఉదారవాది (లిబరల్)…
SheikhHasina: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను తరిమికొట్టారు..!
Nancharaiah merugumala senior journalist: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను బాంగ్లా యువకులు ఇండియా తరిమికొట్టారు..హైదరాబాదైనా ఢాకా అయినా రజాకార్ అనేది ఇప్పుడు బూతు మాటే! 1940ల చివర్లో నాటి హైదరాబాద్ స్టేట్లోని తెలంగాణ ప్రాంతంలో ‘రజాకార్లు’ అంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనకు మద్దతుగా నిలిచిన కిరాయి ముస్లిం సాయుధ గూండాలు. వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేశారు. నిజాం పోలీసులను, పాలనను నిరసించిన ముస్లింలను సైతం రజాకార్లు వదలలేదు….
wayanadlandslide: వయనాడ్ విషాదం.. ‘డార్లింగ్’ భారీ విరాళం..!
Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. కేరళలోని వయనాడ్ విషాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన భారీ విరాళం ప్రకటించారు. వయనాడ్ బాధితుల సహయార్థం కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 2 కోట్ల విరాళం ఇస్తున్నట్లు ప్రభాస్ టీం సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ.. డార్లింగ్ మనసు బంగారం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అటు సినీఅభిమానులు సైతం గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్…