పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి  ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పతనం అంచున  పోలీస్ ప్రభుత్వం.. పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని…

Read More

ప్రతిపక్ష నేతల్ని అడ్డుకునేందుకు వైసీపీ చీకటి జీవోను తీసుకొచ్చింది: పవన్ కల్యాణ్

వైసీపీ ప్రభుత్వం  తీసుకొచ్చిన జీవో 1 పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ప్రతిపక్ష నేతల్ని  అడ్డుకునేందుకు బ్రిటీష్ కాలం నాటి చీకటి జీవోను సీఎం జగన్ అమల్లోకి తెచ్చారని మండిపడ్డారు.  ఓటమి భయంతోనే వైసీపీ దుందుడుకు చర్యలకు దిగుతూ.. ఇలాంటి చెత్త జీవోలు తీసుకువస్తోందన్నారు. సీఎం జగన్ అరాచక విధానాలపై ఏ విధంగా సంయుక్త పోరాటాలు చేయాలనే అంశం మీద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో చర్చించినట్టు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఐక్య…

Read More

పార్టీలకు ఈ యేడు పరీక్షా కాలమే..!

2023, సమకాలీన భారత రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న సంవత్సరం. ఈ కాలపు రాజకీయాల్లో ఎన్నికలు పార్టీలకు అగ్నిపరీక్ష మాత్రమే కాదు ఒక అవకాశం. తిరగేసి చూసినా అంతే, అవకాశం మాత్రమే కాదు ఒక అగ్నిపరీక్ష! లోక్‌సభకు 2024 లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ముందు ఈ సంవత్సరమే 9 రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. బయట ప్రచారం జరుగుతున్నట్టు కశ్మీర్‌ లో ఎన్నికలు జరిపించే చిత్తశుద్ది కేంద్రం కనబరిస్తే, అది ఈ యేడాది ఎన్నికలు…

Read More

ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ

ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…

Read More

అవకాశం అదే .. అగ్ని పరీక్షా అదే!

నారా లోకేష్‌లో పరివర్తన నాలుగుదశాబ్దాల తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో పెనుకుదుపే! తండ్రి చాటు బిడ్డ అని ముద్రపడ్డ లోకేష్‌ రాజకీయంగా తననుతాను నిరూపించుకోవడానికి ‘యువగళం’ పాదయాత్ర ఎంతటి అగ్నిపరీక్షో అంతకుమించి అరుదైన అవకాశం. దేశంలో ప్రధాన స్రవంతి పార్టీలైన కాంగ్రెస్‌ మసకబారి, బిజెపి మొగ్గవిచ్చని స్థాయిలోనే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా … ఎ.పి.లో పాలక వై.ఎస్‌.ఆర్‌.సి.పి ని ధీటుగా ఎదుర్కోవాల్సింది తెలుగుదేశం పార్టీయే. ఆ పార్టీకి పూర్వవైభవం తెచ్చే చంద్రబాబు రాజకీయ వారసుడిగా నిరూపించుకోవడమా? దారి…

Read More

కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది….

Read More

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….

Read More

రాజకీయ నాయకుల దిగజారుడు మాటలకు అంతం ఉండదా?

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు. కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు….

Read More

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్  ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని  నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన..  ప్రతిపక్ష నేత  చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు   నిదర్శనమన్నారు .  ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా …

Read More

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More
Optimized by Optimole