కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది….

Read More

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….

Read More

రాజకీయ నాయకుల దిగజారుడు మాటలకు అంతం ఉండదా?

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు. కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు….

Read More

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్  ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని  నర్సాపురం ఎంపీ  రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక  ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన..  ప్రతిపక్ష నేత  చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు   నిదర్శనమన్నారు .  ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా …

Read More

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More

కాపులు ఎవరు? వారి జనసంఖ్య ఎంత? ‘రాజ్యాధికారం’ ఎప్పుడొస్తుంది?

Nancharaiah merugumala:(senior journalist) కాపులు ఎవరు? కాపు, బలిజ, తెలగ, ఒంటరి (కేబీటీఓ) సముదాయం జనం ఎంత మంది? కాపులకు ఇప్పుడు అసలు ‘రాజ్యాధికారమే’ లేదా? కాపు సంస్కృతి అనేది ఉందా? ఈ విషయాలపై అమెరికా సంయుక్త రాష్ట్రాలకు (USA) చెందిన బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) లేదా మసాచూసెట్స్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఆప్‌ టెక్నాలజీ (ఎంఐటీ) నిపుణులతో అధ్యయనం చేయిస్తే బావుంటుంది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారికి ఎవరైనా ఈ సలహా…

Read More

మాచర్ల ఘటనను ఖండిస్తున్నా : నాదెండ్ల మనోహర్

మాచర్ల హింస ఘటనను ఖండిస్తున్నామన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. ఇది అప్రజాస్వామికని… ఈ ఘటనను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపరమైన కార్యక్రమాలు చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాన్ని అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వైసీపీ శాశ్వత అధికారం లక్ష్యంతో ఈ విధంగా ముందుకు వెళ్తోందని దుయ్యబట్టారు. ఘర్షణ వాతావరణం సృష్టించడం.. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేయడం.. ప్రైవేటు ఆస్తులపై, వ్యక్తులపై దాడులు చేయడం ఎంత మాత్రం సరి కాదని…

Read More

మాచర్ల లో హై అలెర్ట్.. బ్రహ్మారెడ్డి గుంటూరు తరలింపు..!!

పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది.అధికార వైసీపీ , ప్రతిపక్ష టిడిపి పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ఇదే ఖర్మ ప్రోగ్రాం చేపట్టిన తరుణంలో.. ఇందుకు ధీటుగా వైసిపి  శ్రేణులు జైపీఆర్కే నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. ఒకరిపై మరొకరు రాళ్ళు, కర్రలతో  దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లర్లను అదుపు చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు.  …

Read More

కోటంరెడ్డి హ్యాట్రిక్ ఖాయం..!!

ఏపీలో నెల్లూరు రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడి నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుండటంతో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ జిల్లాపై పట్టుకోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి.గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఈనేపథ్యంలోనే పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో చర్చించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ఎమ్యెల్యే పనితీరూ.. వైసీపీ…

Read More

తూర్పు, మున్నూరు కాపులను ఉద్ధరించే స్థితిలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం ఉందా?

Nancharaiah merugumala: ______________________ తూర్పు, మున్నూరు కాపులకు.. కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయం దారి చూపగలదా? ………………………………………………………………………… ఆంధ్రప్రదేశ్‌ లో బీసీ హోదా ఉన్న తూర్పు కాపులకు శనివారం అమరావతిలో ‘దిశానిర్దేశం’ చేశారు జనసేన పార్టీ నేత, కాపు, బలిజ, తెలగ, ఒంటరి సముదాయానికి చెందిన కొణిదెల పవన్‌ కల్యాణ్‌. కా–బ–తె–ఒం కులాలు తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చాలని ఎంతో కాలంగా ప్రభుత్వాలను కోరుతున్నాయి. తమ లక్ష్య సాధనకు ఇప్పటికే బీసీ–డీ గ్రూపులో ఉన్న ఉత్తరాంధ్ర…

Read More
Optimized by Optimole