Telangana: మోట కొండూరులో సేవ్ దామగుండం పేరిట నిరసన..

Telangananews:  వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ అనంతగిరి దామగుండ రక్షిత అడవులలో నౌకాదళ రాడార్ కేంద్ర ఏర్పాటుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా మోట కొండూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర వివిధ సంఘాల నాయకులు, ప్రకృతి ప్రేమికులు నిరసన తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల అడవిలో జీవిస్తున్న స్థానికులకు, జీవరాసులకు, నగరవాసులకు ముప్పు పొంచి ఉందని,మూసి నది ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని రచయిత పి.చిన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి,అటవీ…

Read More

Telangana: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!

MLCElection’s2024: ఉత్తర తెలంగాణలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎన్నికలకు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. టికెట్ కోసం ఆశావాహులు సైతం ప్రయత్నాలు మొదలెట్టారు.అయితే అధికార కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీకి అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి జోరుమీదున్న బీజేపీ, ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు బలమైన అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు సైతం…

Read More

KCR: కేసీఆర్ 3.0

KCR: కేసీఆర్ కోలుకున్నట్టున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజున ఒంటికి తగిలిన గాయం నుంచి ఇదివరకే కోలుకున్నా, రాజకీయ గాయం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టున్నారు. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీలకు ఇప్పుడొక గట్టి హెచ్చరిక నోటీస్ జారీ చేశారు. ఇరువురికీ సమదూరం పాటించే పోరాట రాజకీయ పంథా ప్రకటించారు. విషాన్ని గొంతుకలో నిలుపుకున్న గరళకంఠుడ్ని అని చెబుతూ.. ఏ క్షణాన్నయినా బద్దలయే అగ్నిపర్వతంలా ఉన్నానన్నారు. లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైళ్లో ఉన్న కూతురు కవిత పరిస్థితిపై…

Read More

Telangana: గాడిద గుడ్డు పేరుతో బిజేపి పై కాంగ్రెస్ ఎటాక్..వినూత్న నిరసన..!

In Telangana: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బ్యానర్లు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఇటీవలి బడ్జెట్ లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చింది..? గాడిద గుడ్డు అంటూ వినూత్న రీతిలో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచింది. అయితే 8 ఎంపీ సీట్లు…

Read More

politics: హీరో ఎవరో..? జీరో ఎవరో..? ప్రజలే తేలుస్తారు..!

Telugustatespolitics: తగలబడిన తన ఇంటిని చక్కదిద్దుకోకుండా పక్క వారి ఇల్లు ఎలా తగలబడిరదా అని విచారించే వివేకి చందంగా ఉంది బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీరు. తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజా తిరస్కరణకు గురైన బీఆర్‌ఎస్‌ తమ వైఫల్యాలను విశ్లేషించుకొని, పార్టీని చక్కదిద్దుకోవాల్సి ఉంది. దానికి బదులు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎలా ఓడిపోయింది అని బాధపడుతున్నట్టు ఉంది ఆయన వ్యవహారం. ఈ రెండు పార్టీలు ఒకే రకమైన తప్పులు చేసి.. ఒకే…

Read More

Telangana: బిఆర్ఎస్ చేసిన తప్పే కాంగ్రెస్ చేస్తుందా..?

Telanganacongress: ఎన్నికలు ముగియగానే ప్రతీ రాజకీయ పార్టీ ప్రధానంగా అధికారం చేపట్టినవారు ‘‘రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం. ఇక పై అభివృద్ధిపైనే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తాం…’’ అంటూ తియ్యటి మాటలను వల్లెవేస్తారు. ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రేవంత్‌ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యతిస్తున్నట్టు కనిపిస్తోంది. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనతో సంతృప్తి చెందని ప్రజలు ఆ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకు మించి పార్లమెంట్‌ ఎన్నికల్లో గట్టి గుణపాఠం…

Read More
bjp telangana,bjp,

BjpTelangana: తెలంగాణ బీజేపీలో అధ్యక్ష పోరు.. పాత కొత్త కలహాలు..!

BjpTelangana:  ‘‘మంచి నాయకుడికి సహనం అనే గుణం ఉండాలి. ఎదగాలనుకునే నాయకుడు ఓపిక పడితే కచ్చితంగా కష్టానికి తగిన ఫలం పొందుతాడు..’’ అనే చాణక్య రాజనీతి ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. లోక్సభ ఎన్నికలు అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉంటుందనే ప్రచారం నేపథ్యంలో నాయకుల మధ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా తీవ్రస్థాయిలో ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అధ్యక్ష పదవి పోరులో నాయకులు సహనం కోల్పోయి చేస్తున్న వ్యాఖ్యలతో నష్టం జరుగుతున్నా బీజేపీ అధిష్టానం…

Read More
జీవన్రెడ్డి,jeevanreddy,mlc,

Telangana: పోచారం చేరిక అవకాశవాదానికి నిదర్శనం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌పై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యే స‌భ్యుల‌తో సుస్థిర ప్ర‌భుత్వం ఉంద‌ని.. ఇత‌ర పార్టీ నేత‌ల‌ను చేర్చుకోవాల్సిన అవ‌స‌రమేముంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏ రాజ‌కీయ పార్టీ అయినా సిద్ధాంంతాల‌కు అనుగుణంగా పోరాటం, ప‌ని చేయాల‌ని హితువు ప‌లికారు. దీంతో పార్టీ ఫిరాంపుల‌పై జీవ‌న్ రెడ్డి చేసిన కామెంట్స్ హ‌స్తంపార్టీలో కొత్త చ‌ర్చ‌కు దారితీసింది. ఇక తాజాగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో…

Read More

Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read More

EXITPOLLS2024 : తెలంగాణ లోక్ స‌భ‌లో బీజేపీ జోరు.. newsminute24 అంచ‌నా..!

Telangana:   తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు గెలిచే అవ‌కాశాలు ఉన్న‌ట్లు newsminute24 సంస్థ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డ‌యింది . బీజేపీకి 8 నుంచి 12 స్థానాలు.. కాంగ్రెస్ కు 3 నుంచి 6 స్థానాలు.. .. బీఆర్‌ఎస్ కు 0-1, ఎంఐఎంకు 1 సీటువ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సంస్థ తెలిపింది. ప‌దేళ్లు అధికారంలో ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్‌ఎస్‌ పార్టీకి 1 పార్లమెంట్‌ స్థానం కూడా…

Read More
Optimized by Optimole