గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా?

గవర సోదరుడు బుద్ధా వెంకన్న..గోదారి రాజు ఆర్జీవీ ‘రాము’ను తిట్టడం బీసీల ‘సాధికారత’ అనిపించుకోదా? ———————————————– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో- రెడ్డి, కమ్మ, కాపు ఆధిపత్య, ప్రేరేపిత రాజకీయాలపై పశ్చిమ గోదావరి జిల్లాలో మూలాలున్న రాజుగోరు పెన్మత్స రాంగోపాల్ వర్మ నోటికొచ్చినట్టు కామెంట్ చేయగూడదంటే ఎలా? గోదారి జిల్లాల రాజులు చేపలు, రొయ్యల పెంపకంలో కూడా రాణించినంత మాత్రాన వారిని అగ్నికుల క్షత్రియులను (బెస్త/మత్స్యకారులు) బెదిరించే రీతిలో బెజవాడ బుద్ధా వెంకన్న మాట్లాడడం న్యాయమా? ఉత్తరాంధ్ర నుంచి వలస…

Read More

మత్స్యకారులకు ఎల్లవేళలా జనసేన అండగా ఉంటుంది: నాదెండ్ల మనోహర్

ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. విద్య, వైద్యం, వలసల నిరోధం, ఉద్యోగ, ఉపాధి కల్పన వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. 76 ఏళ్ల స్వతంత్ర భారతంలో చిన్న చిన్న అవసరాల కోసం కూడా దేహీ అంటూ అడుక్కునే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైందన్న ఆయన..రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలని వ్యాఖ్యానించారు.  ఇక…

Read More

పతనం అంచున పోలీస్ ప్రభుత్వం: ఎంపీ రఘురామ

ఏపీలో ప్రభుత్వం మారితే..ఇంతకంటే గొప్పగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు. రాష్ట్రంలోని ప్రజలకు.. రాజ్యాంగంలో 14 నుంచి 22వ అధికరణ లో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు అమలు కావాలంటే.. వైసీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోవాలన్నారు. ఎలుకల్లా అధికారంలోకి వచ్చినవారు.. పందికొక్కుల్లా మారి  ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు. పతనం అంచున  పోలీస్ ప్రభుత్వం.. పతనం అంచుల్లో ఏపీ పోలీసు ప్రభుత్వం ఉందని…

Read More

ఏపీ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసింది: నాదెండ్ల

వివేకానంద జయంతి పురస్కరించుకుని జనసేన తలపెట్టిన యువ శక్తి కార్యక్రమానికి పోలీసులు అనుమతి లభించిందన్నారు ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.  రణ స్థలంలో సభా స్థలిని జనసైనికులతో పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసిపి ప్రభుత్వంపై మాటల తూటాలతో విరుచుకుపడ్డారు.అభివృద్ధిని పూర్తిగా పక్కనపెట్టిన జగన్ ప్రభుత్వం మీద రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనం సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  యువతరం భవిష్యత్తు కోసం నిర్వహించే కార్యక్రమానికి యువత…

Read More

ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ

ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…

Read More

జగన్ ప్రభుత్వంలో సామాజిక వర్గాలకు అన్యాయం : ఏపీసీసీ రుద్రరాజు

విజయవాడ: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఎనిమిదిన్నరేళ్లుగా టిడిపి, వైసీపీ ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ లను ఓటు బ్యాంకు గా వాడుకొని మోసం చేస్తున్నాయని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలు..మైనార్టీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పధకాలన్నీ వర్తింపచేయాలని రుద్రరాజు డిమాండ్ చేశారు.  ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పక్షాన యాక్షన్ ప్లాన్ త్వరలోనే అమలు చేయబోతున్నట్లు రుద్రరాజు వెల్లడించారు.జనవరి…

Read More

చీకటి జీవోను రద్దు చేయండి: ఎంపీ రఘురామ

రాజకీయ పార్టీలు నిర్వహించే  ర్యాలీ, నిరసన కార్యక్రమాలను నిషేధిస్తూ  వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీవోను తక్షణమే  ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు. ఈ జీవో రాజ్యాంగంలోని  ఆర్టికల్ 19(1) బి కి పూర్తి విరుద్ధమని మండిపడ్డారు. 1972లో ముంబై పోలీస్ కమిషనర్ ఇటువంటి జీవో జారీ చేయగా.. హిమ్మత్ లాల్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే జీవోను కొట్టివేసిందని గుర్తు చేశారు. సాధారణంగా ఇటువంటి జీవోలు  పోలీసులు…

Read More

కాపులకు సంపూర్ణ ‘రాజ్యాధికారం’ రాకున్నా..‘రాజకీయాధికారం’ వచ్చేసిందా?

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజకీయ పార్టీల అధ్యక్షులూ కాపులే! ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవి తమ నాలుగు కులాల్లో దేనికీ రాలేదనే బాధ కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులను ఇప్పుడు దహించివేస్తోంది. నిజమే. సంపూర్ణ ‘రాజ్యాధికారం’ ఇంకా ఈ నాలుగు కులాల సముదాయానికి గగన కుసుమం మాదిరిగానే కనిపిస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ పేరిట జరిగిన తొలి ‘రాజ్యాధికార’ ప్రయత్నం విఫలమైంది. 2014 ఎన్నికల్లో తాను స్వయంగా పోటీచేయని జనసేన మాత్రం తెలుగుదేశం పార్టీని అమరావతిలో అందలమెక్కించింది….

Read More

దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలి: ఎంపీ రఘురామ

పింఛన్ లబ్ధిదారులకు  దొంగ నోట్ల పంపిణీ వ్యవహారంపై  కేంద్ర దర్యాప్తు సంస్థ  ఎన్ఐఏ  చేత విచారణ జరిపించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంతో ప్రభుత్వ పెద్దలకు నిజంగానే సంబంధం లేకపోతే ముఖ్యమంత్రి రవ్వంత చొరవ తీసుకొని ఎన్ఐఏ విచారణ కోసం లేఖ రాయాలని కోరారు. అవసరమైతే తాను సైతం లేఖ రాస్తానని స్పష్టం చేశారు.ఈ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన తర్వాత మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం జరుగుతోందని రఘురామ విమర్శించారు….

Read More

రాజకీయ నాయకుల దిగజారుడు మాటలకు అంతం ఉండదా?

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది‘ అంటారు పెద్దలు. మన నోటి నుంచి వచ్చే మాటలు కత్తి కంటే పదునైనవి. మనం మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి మాట పెదవి దాటితే దాన్ని వెనక్కి రప్పించడం సాధ్యం కాదు. కానీ, దురదృష్ట వశాత్తు మన రాజకీయ నాయకుల మాటలు వింటుంటే ఆవేదన, అదే సమయంలో ఆగ్రహం కలగకమానవు. నిజం చెప్పాలంటే రాజకీయ నాయకులు రోజు రోజుకు విలువల వలువలు ఊడదీసే ప్రయత్నం నిరాటంకంగా మందుకు తీసుకెళ్తున్నారు….

Read More
Optimized by Optimole