×

శాస్త్రవేత్త..తత్వవేత్త..సాహితీవేత్త..ప్రకృతి ప్రేమికుడు..మార్గదర్శకుడు..అన్నిటికి మించి గొప్ప మానవతావాది..’మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ‘ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన సేవలను యావత్ భారతావని స్మరించుకుంటుంది.

1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు.1958 మద్రాస్ ఐఐటీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్నతనం నుంచి తాను కలలు కన్న పైలట్ కల త్రుటిలో చేజారి పోవడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో చేరారు. 1969 భారతదేశం తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్ ఏల్వీ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ నియమితులయ్యారు. అనంతరం పిఎస్ఎల్వీ రూపకల్పన కోసం శ్రమించారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్మెంట్ లో భాగంగా అగ్ని పృథ్వి మిస్సైల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి..దేశానికి తొలి మిస్సైల్ అందించారు. దీంతో వారికి ‘మిస్సైల్ మ్యాన్’ బిరుదు లభించింది.

1922 లో భారత ప్రభుత్వానికి ప్రధాన సాంకేతిక సలహాదారుగా కేబినెట్ హోదాలో కొనసాగారు కలాం. 1998లో వారి కృషి ఫలితంగా పోఖ్రాన్_2 అణు పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంతో భారత్ అణ్వస్త్ర దేశాల సరసన నిలిచింది. 2002 అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం..ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగిపోయింది.ప్రథమ పౌరుడి హోదాలో దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా చాటిన ఘనత కలాందే.

రాష్ట్రపతి పదవి కాలం పూర్తయిన తర్వాత నిత్య బోధకుడిగా.. ‘కలలు కనండి ..కలలను సాకారం చేసుకోండి’ అంటూ యువతకు మార్గనిర్దేశనం చేశారు. విశేష సేవలకు గాను దేశంలోని అత్యున్నత పురస్కారాలు 1990లో పద్మ విభూషణ్ 1997 లో భారతరత్న కలాంను వరించాయి .దేశంలోని 30కిపైగా విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి.

సామాన్యుడిగా మొదలైన కలాం ప్రస్థానం అనంతమైన విశ్వాన్ని సృజించి..దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించి తిరిగి సామాన్యుడిగా జీవించిన కలాం వ్యక్తిత్వం ఎందరికో ఆదర్శం మరెందరికో స్ఫూర్తి దాయకం.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక...

Read out all
Optimized by Optimole