ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయం కలిస్తే ఒక సంవత్సరం గా భావిస్తాం. ‘ఉ’ అంటే నక్షత్రమని , ‘గ’ అంటే గమనమని.. దీన్ని ఈరోజు నుంచి లెక్కిస్తారని శాస్రం చెబుతున్నది. మొదటి సంవత్సరం, ఋతువు, మాసం, తిథి అయిన పాడ్యమిని మొదటి రోజుగా ఉగాదిని జరుపుకుంటాం.
పురాణ కథ:
సూదర్శనుడు అనే రాజు శక్తి సాయంతో యుద్ధం గెలిచాక తన భార్య, అత్తింటివారితో కలిసి అమ్మవారికి పూజలు చేశాడని చెబుతారు. ఆసమయంలో అమ్మవారు ప్రత్యక్షమై, నవరాత్రులు పేరుతో తనకు పూజలు చేయమని కోరిందట. అలా ప్రారంభమైనవే నవరాత్రులని అంటారు. రామలక్ష్మణులు కూడా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని పూజించేవారని చెబుతారు. ఈ సమయంలో రామనామ జపాన్ని కూడా నిర్వహించే సంప్రదాయం ఉంది. ఇలా సర్వశుభాలను కలిగించే కొత్త ఏడాదిని అమ్మవారి అనుగ్రహముతో ఆనందమగా ప్రారంభించడమే ప్రధాన ఉద్దేశ్యం.ఉగాది రోజు పాటించవలసిన నియమాలు : 1. తైలాభ్యంగనం : ఉగాదిరోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి తైలాభ్యంగనం చేయాలని శాస్త్రం చెబుతుంది. ఒంటికి, తలకి నువ్వులనూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని అభ్యంగన స్నానం చేయాలి. ఇంట్లో పూజాదికాలు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేయాలి.
ప్రతిగృహద్వజారోహణం :
దేశానికి స్వతంత్య్రం వచ్చినప్పుడు లేదా దేశానికి సంబంధించిన పండుగలు వచ్చినప్పుడు సాదారణంగా జెండాలు ఎగురవేస్తుంటాం. అదే విధంగా బ్రహ్మకు సంబంధించినది, ఇంద్రుడికి సంబంధించినది ధ్వజారోహణ ఇంటి ముందు చేయాలట. మన రాష్ట్రాల్లో ఇలాటి పద్ధతులు కనిపించవు కాని మహారాష్ట్రలో ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను పెట్టి ధ్వజారోహణం చేస్తారు.
నవ వస్త్రాభరణధారణం, ఛత్రచామరాది స్వీకరణం :
నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతుంది. ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పి నుంచి గొడుగు వేసుకోవడం చాలా అవసరం. ఉగాది రోజు కొత్త గొడుగు సంపాదించి ఉంచుకోవాలని సంకేతం. ఛత్ర ధారణం నేెత్ర శాంతికరం, ఎండ, గాలి, వాన మున్నగు వాని నుండి కాపాడి సౌఖ్యప్రదంగా ఉంచుతుంది. ఉగాదిరోజు చామరకు కూడా స్వీకరించాలి.ఎండాకాలం విసనకర్ర ఆవశ్యకం బాగా ఉంది. వాటిలో వ్టివేళ్ళతో చేసినవి, వెదురుతో చేసినవి, తాకులతో చేసినవి శ్రేష్ఠమైనవి, వాటితో విసురుకోవడం వలన మేహశాంతి కలుగుతుంది. నేత్రాలకి చల్లదనంగా ఉంటుంది. ఛత్రచామరాలని ఈ ఎండాకాలంలో దానం చేయడం వలన కూడా విశేషమైన ఫలితం ఉంటుంది.
దమనేన పూజ :
దమనం అంటే ఒక పత్రి. సుగంధం వచ్చే పత్రి. పూర్వకాలం విరివిగా దొరికేవి. దవనంతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణిమ వరకు రోజూ ఒక దేవతా మూర్తికి పూజ చేయాలి.చైత్రశుక్ల పాడ్యమి : బ్రహ్మకు; చైత్ర శుక్ల విదియ : ఉమ, శివ, అగ్నులకు ; చైత్ర శుక్ల తదియ : గౌరీ శంకరులకు; చైత్ర శుక్ల చతుర్థి : గణపతికి ; చైత్ర శుక్ల పంచమి : నాగులకు; చైత్ర శుక్ల షష్ఠి : కుమారస్వామికి; చైత్ర శుక్ల సప్తమి ; సూర్యునకు ; చైత్ర శుక్ల అష్టమి : మాతృదేవతలకు; చైత్ర శుక్ల నవమి : మహిషాసుర మర్దినికి; చైత్ర శుక్ల థమి: ధర్మరాజుకు; చైత్ర శుక్ల ఏకాదశి : మునులకు; చైత్ర శుక్ల ద్వాదశి : శ్రీ మహావిష్ణువుకు; చైత్ర శుక్ల త్రయోదశి : కామదేవునకు; చైత్ర శుక్ల చతుర్దశి : శంకరునకు; చైత్ర శుక్ల పూర్ణిమ : శచి, ఇంద్రులకుసర్వాపచ్ఛాంతికర మహాశాంతి : సంవత్సరాది వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయవలసిన పండుగగా చెప్పబడి ఉంది. మహాశాంతి కలిగించుట వలన అన్ని దుఃఖాలు తొలుగుతాయి. మహాశాంతి చేయవలసని పండుగలో ఇది ఒకి కాబట్టి పూర్వం ఉగాది రోజు సంవత్సరేష్టి అనే యజ్ఞం చేసేవారని కనిపిస్తుంది.
ఉగాదిరోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి.పంచాంగపూజ, పంచాంగ శ్రవణం : ఉగాదిరోజు ఉదయాన్నే దేవుని దగ్గర పంచాంగాన్ని ప్టోలి. ప్రతి ఇంటిలో ఆ సంవత్సరం పంచాంగం ఉండాలి. పంచాంగం ఆ సంవత్సరంలో మనం చేయవలసిన కార్యక్రమాలకి అనువైన వాటిని చూపించే కరదీపికగా చెబుతారు. అందుకని పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకుని బ్రామ్మణ ముఖంగా లేదా జ్యోతిష్కుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి. అలా వింం కాబట్టే పంచాంగ శ్రవణం అని పేరు.పంచాంగశ్రవణం వలన గంగాస్నానం చేసిన ఫలితం గోదానం చేసిన ఫలితం లభిస్తుంది. శత్రువులు దూరం అవుతారు. దుస్వప్ననాశనం అవుతుంది. సంతానం, సంపత్తు కలుగుతుంది. అన్ని కర్మలు సాధించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా పంచాంగ శ్రవణం చేయాలి.
ప్రపాదాన ప్రారంభం :
బ్రహ్మాది సమస్త దేవతా స్వరూపమైన ధర్మఘట్టం దానం చేస్తున్నాను కాన నా మనోరథములన్నీ సమకూరాలని సంకల్పం చేసి నీటి కుండను దానం చేయాలి.రాజదర్శనం : ఉగాదిరోజు రాజదర్శనం చేయాలాంరు. ఈ రోజుల్లో అది అసాధ్యం కాదు కాబట్టి దేవతాదర్శనం వలన ఈశ్వరానుగ్రహం వలన అందరూ అనుకూలంగా ఉంటారు అని తెలుసుకొని దేవాలయ దర్శనం చేయడం విశేషం.
వసంత నవరాత్రి ప్రారంభం :
శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజలు ఏ విధంగా చేస్తారో వసంత నవరాత్రుల్లో కూడా అదే విధంగా కలశస్థాపన చేసి అమ్మవారి పూజలు చేయాలి. వసంత నవరాత్రుల్లో రామాయణ పారాయణ కాని, సుందరాకాండ పారాయణ కాని రామనామ జపాన్ని కాని ప్రత్యేకంగా చేస్తారు.
నింబకుసుమ భక్షణం : ఉగాదిరోజు ముఖ్యంగా నింబకుసుమ భక్షణం అని కొన్ని చోట్ల ఉంటే నింబ పత్ర భక్షణం అని మరికొన్ని చోట్ల కనిపిస్తుంది. వాతావరణాన్ని అనుసరించి ఏర్పడిన సాంప్రదాయంగా దీన్ని చెబుతారు. వైద్యగ్రంథాలనుంచి తీసుకున్నదిగా దీన్ని చెబుతారు. నింబ కుసుమం అంటే వేప పువ్వు. నింబ పత్ర అంటే వేప ఆకు. ఇలాటి వాటిని తప్పనిసరిగా ఉగాదిరోజు ప్రతి ఒక్కరూ తినాలని మనకి శాస్త్రం చెబుతోంది. దాని నుంచే మనకి ఏర్పడినది ఉగాది పచ్చడి.ఉగాది పచ్చడికి నవగ్రహాలకు కారకాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిలోని తీపికి గురుడు, ఉప్పు దానిలోని రసానికి చంద్రుడు, కారానికి కుజుడు, మిరియాల పొడికి రవి, పులుపుకి శుక్రుడు అన్ని రుచులు కలిపిన వాటికి శని, బుధులు కూడా కారకులవుతారు.కావున ఇన్ని విశిష్టతలు ఉన్న ఉగాది ద్వారా నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్లవ నామ సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ఎప్పుడూ ఆ శ్రీమాత దీవెనలు ఉండాలన్నదే పండగ ఉద్దేశ్యం.