దేశ వ్యాప్తంగా వెలువడిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ కంచు కోటైనా.. రాంపుర్ లోక్సభ స్థానాన్ని బద్దలు కొట్టి ఆస్థానాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి ఎస్పీ నేతపై 42వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక త్రిపురలో బీజేపీ మూడు స్థానాల్లో గెలుపొందింది. టౌన్ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాతోపాటు జుబరాజ్నగర్, సుర్మా స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఇక తాజా ఉప ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బీజేపీ కి ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రజారంజక పాలన కొనసాగిస్తామని అన్నారు. యూపీ ఫలితాలు చారిత్రక తీర్పుగా ప్రధాని అభివర్ణించారు.