×

పార్థ సారథి పొట్లూరి: 

గత వారం లేదా పది రోజుల వ్యవధిలో దాదాపుగా 10 మంది టెర్రరిస్టు లు హత్య చేయబడ్డారు పాకిస్థాన్ లోని వివిధ ప్రాంతాలలో!
అందరూ నోటెరియస్ టెర్రరిస్ట్ లే !
అయితే ఎవరు చేస్తున్నారు ఈ హత్యలు ?
పాకిస్థాన్ మీడియా కావొచ్చు లేదా ప్రజలు కావొచ్చు రెండు రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు !

1. భారత గూఢచార సంస్థ RAW ఈ హత్యల వెనుక ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్ధిక పరిస్థితి బాగాలేదని దాంతో RAW పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి పాకిస్థాన్ లోని కిరాయి హంతకులని ఉపయోగించుకుంటున్నది !
2. TTP [తెహ్రిక్ తాలిబన్ ఆఫ్ పాకిస్థాన్ ] కి చెందిన వాళ్ళు ఈ హత్యలు చేస్తున్నారు. ప్రస్తుతం పాక్ ఆర్మీ దగ్గర ఉన్న అధునాతన స్నేపర్ రైఫిల్స్ TTP దగ్గర కూడా ఉన్నాయి. అందుకే హంతకులు ఎవరో కనిపెట్టలేకపోతున్నారు అని.
*****************
పై రెండిటిలో RAW మీదనే ఎక్కువ శాతం మంది ప్రజలు మరియు మీడియా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు !
సహజంగా భారత్ మీద అనుమానం రావడం సహజం !
కొంతమంది అత్యుత్సాహం తో RAW విజయవంతంగా పాకిస్థాన్ లో ఆపరేషన్స్ ని నిర్వహిస్తున్నది అంటూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి ఆనందపడుతున్నారు !
ఈ వరుస హత్యల నేపధ్యంలో చివరికి తాలిబన్లు కూడా పాకిస్థాన్ కి ఇదే చివరి అవకాశం అంటూ హెచ్చరికలు చేశారు ! అంటే ఆ హత్యలు మేమే చేస్తున్నాము అని క్లెయిమ్ చేసుకుంటున్నారు తాలిబన్లు !

అసలు నిజం ఏమిటో సిఐఏ లీక్ చేసింది ! హత్యలు చేయిస్తున్నది కాదు చేస్తున్నది పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI!

IMF పాకిస్థాన్ కి బెయిల్ అవుట్ పాకేజీ ఇవ్వడానికి ఒప్పుకున్నా చాలా షరతులు విధించింది ! వాటిని పూర్తి చేస్తేనే అప్పు ఇస్తానని మెలిక పెట్టింది.
IMF పెట్టిన షరతులలో ప్రధానమయినది : పాకిస్థాన్ ఆర్మీ ప్రస్తుత జెనెరల్స్ మరియు ఇటీవల కాలంలో పదవీ విరమణ చేసిన జెనెరల్స్ ఆస్తుల వివరాలు వెల్లడించాలి ! ఇలా చేస్తే పాక్ ప్రజల నుండి ఆర్మీ కి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలవుతుంది అని IMF వ్యూహం ! ఇందులో నిజం ఉంది ! పాక్ ఆర్మీ జెనెరల్స్ ఆస్తుల వివరాలు బహిర్గతం చేస్తే మాత్రం కళ్ళు బైర్లు కమ్మే విషయాలు బయటపడతాయి !

దశాబ్దాలుగా పాకిస్థాన్ సైన్యంలో పనిచేసిన ఉన్నత స్థాయి అధికారులు ఎవరూ కూడా రిటైర్ అయిన తరువాత పాకిస్థాన్ లో ఉండడం లేదు ఎందుకని ? రిటైర్ అయ్యేవరకు సంపాయించుకోవడం రిటైర్ అయిపోయిన తరువాత పాకిస్థాన్లోని ఆస్తులని అమ్మేసుకొని బ్రిటన్,సౌదీ,UAE లలో స్థిరపడిపోతున్నారు ! ఇటీవలి కాలంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ మీరు వేరే దేశాలకి ఎందుకు వెళుతున్నారు మా దేశంలో ఆస్థులు కొనుక్కొని టర్కీ లోనె స్థిరపడిపోవచ్చుగా అంటూ ఆశ పెట్టెసరికి రూటు మార్చి టర్కీ లో ఆస్థులు కొంటున్నారు ప్రస్తుత జెనెరల్స్ ! ఇక వేరే దేశాలకి వలస వేళ్ళ లేని రిటైర్డ్ ఆర్మీ అధికారులు పాకిస్థాన్ లోనె ఉండిపోయి ఏదో ఒక ప్రభుత్వ శాఖ కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ గా ఉండి తమ ఆస్తులని కాపాడుకుంటున్నారు ! ప్రభుత్వం నుండి ఉచితంగా బంగ్లా తో పాటు ఇతర సౌకర్యాలు కూడా అనుభవించవచ్చు వృద్ధాప్యం మీద పడినా కూడా !

ఇటీవలే FATF మళ్ళీ హెచ్చరించింది పాకిస్థాన్ ని గ్రే లిస్ట్ లో పెడతాను అంటూ !
FATF కనుక పాకిస్థాన్ ని మళ్ళీ గ్రే లిస్ట్ లో పెడితే అది IMF నుండి అప్పు తీసుకోవడానికి వీలు పడదు !
ప్రస్తుతానికి IMF మరియు FATF ల దృష్టి మరల్చడానికి ISI ఇక పనికి రారు లేదా వృద్ధులు అయిపోయిన కొంత మంది టెర్రరిస్టు లని ఎంపిక చేసుకొని తన షార్ప్ షూటర్స్ ద్వారా వారానికి ఒక్కకకరిని హత్య చేయిస్తున్నది !
మోస్ట్ వాంటెడ్ దావూద్ ఇబ్రాహీం ని హత్య చేయించవచ్చు ISI త్వరలో ! ఎందుకంటే దావూద్ కి సంబంధించి వేల కోట్ల రూపాయాలు దుబాయి,సౌదీ,లండన్ లతో పాటు ముంబై లో కూడా ఉన్నాయి. ముంబై లో ఉన్న ఆస్థులు ఎటూ పాక్ ఆర్మీ కి దక్కే ఛాన్స్ లేదు కానీ లండన్,దుబాయి,సౌదీ లలోని ఆస్తులని స్వాధీనం చేసుకోవచ్చు.

కాబట్టి దావూద్ ఇబ్రాహీం తో పాటు ముంబై టెర్రర్ ఎటాక్ సూత్రధారి మసూద్ అజహర్ ని కూడా మట్టు పెడుతుంది ఐఎస్ఐ త్వరలో. ప్రస్తుతం పాకిస్థాన్ లో జరుగుతున్న వరుస హత్యలు కేవలం కర్టెన్ రైజర్ మాత్రమే !
త్వరలో మనం దావూద్,మసూద్ అజహర్ ల హత్యల గురుంచి వినబోతున్నాము!
నిజానికి ఐఎస్ఐ అంత పని చేస్తుందా అనే సందేహం రావొచ్చు చాలామందికి !
కానీ తప్పదు. డాలర్లు లేకుండా ఏ పనీ కాదు పాకిస్థాన్ కి ! అవి రావాలంటే ఐఎంఎఫ్ నుండి అప్పు రావాలి ! లేకపోతే తమ సైనిక జెనరల్స్ ఆస్తుల మీద సిఐఏ కాన్సంట్రేట్ చేసింది కాబట్టి వదలదు !

ఇప్పటి వరకు జరిగిన హత్యలు మోటార్ బైక్ ల మీద ముసుగులు ధరించిన వాళ్ళు వేగంగా వచ్చి ఘాట్ చేసి అంతే వేగంగా బైక్ మీద పారిపోయారు! ఇలాంటి ఆపరేషన్స్ చేయగలిగేది ఐఎస్ఐ మాత్రమే !

పాకిస్థాన్ లో ఏ హత్య జరిగినా దానిని RAW అకౌంటు లో వేస్తుంది ఐఎస్ఐ. ప్రజలు కూడా నిజమే అని నమ్మేస్తారు !
అల్ జవహరి ని సిఐఏ కి అప్పచెప్పిన పాక్ ఆర్మీ కి తాలిబాన్ మరియు TTP ల నుండి ముప్పు ఉంటుంది అని తెలిసీ రిస్క్ తీసుకుంది. అలాంటిది దావూద్, మసూద్ అజహర్ లని మట్టు పెట్టి ఆ నెపం RAW వేయడం పెద్ద పనేమీకాదు కదా ?
అంచేత సోషల్ మీడియాలో అజిత్ దోవల్ పేరుని,RAW పేరుని వాడకండి తెలిసీ తెలియకుండా ! అది పరోక్షంగా పాకిస్థాన్ కి సహాయం చేసినట్లు అవుతుంది ! ఐఎస్ఐ కోరుకుంటున్నదీ ఇదే ! తస్మాత్ జాగ్రత్త !
జైహింద్ ! జై భారత్ !

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక...

Read out all
Optimized by Optimole