వరంగల్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న నెపంతో ఓ మహిళను ఆమె భర్త కుటుంబసభ్యులు హింసించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ధర్మసాగర్ మండలంలోని తాటికాయల గ్రామానికి చెందిన గంగా అనే మహిళకు ములుగు మండలం బోలోనిపల్లికి చెందిన రాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. తాజాగా రాజు తన బంధువైన ఓ వివాహితతో సంబంధం పెట్టుకొని, పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు వదిలి వెళ్లిపోయాడు.
ఈ విషయం తెలుసుకున్న గంగా కుటుంబసభ్యులతో కలిసి వారికి వెతికి పట్టుకున్నారు. ఇద్దరిని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడ వారిపై విచక్షణారహితంగా దాడి చేసి, ఇద్దరికి గుండు గీయించారు.దాంతోనే ఆగకుండా, మహిళను మంచానికి కట్టేసి ఆమె ప్రైవేట్ పార్ట్స్లో జీడిని నింపి శారీరకంగా అమానుషంగా హింసించారు. బాధిత మహిళ ప్రాణాలను రక్షించండి అంటూ అరిచినా, క్షమాపణలు కోరినా వారు వినిపించుకోలేదని సమాచారం.
దాడి కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగినప్పటికీ ఆమెను వదలలేదు. ప్రస్తుతం ఆ దంపతులు తిరిగి కనిపించకుండాపోయారు. ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, ఘటనలో పాల్గొన్న నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.