×

వైసీపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్  నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర బడ్జెట్ 2.30 లక్షల కోట్లు దాటిందని..డబ్బులు ఎటుపోతుందని ఆయన ప్రశ్నించారు. శంకు స్థాపనల పేరిట ప్రజల్ని మోసం చేస్తూ..కాలం వెళ్లదీస్తున్న జగన్ ప్రభుత్వం.. అభివృద్థి పనులు చేయకుండా ఎన్ని రోజులు కాలక్షేపం చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన.. విశాఖ రాజధాని చేస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయని వైసీపీ ప్రభుత్వం.. ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నియోజక వర్గాల అభివృద్ధి..ఉద్యోగాలు.. వలసల నిరోధం వంటివి యువత కోరుకుంటుందని మనోహర్ స్పష్టం చేశారు.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 32 మంది త్యాగాలు చేశారని..కానీ ప్లాంట్ ప్రైవేటికరణ విషయంలో వైసీపీ నేతలు నోరు మెదపడంలేదని మనోహర్ మండిపడ్డారు.అలాగే రాజధాని అమరావతి కోసం రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారని.. ఇప్పుడు సీఎం జగన్ రాజధాని మార్చాలని పట్టుబట్టడం మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. ఉత్తరాంధ్ర భూకబ్జాల గురించి ఆధారాలతో సహా చెప్పడానికి రైతులు జనసేన జనవాణి కార్యక్రమానికి క్యూ కడుతున్నారని.. వైసీపీ అరాచకాలకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందని మనోహర్ తేల్చిచెప్పారు.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

Bollywood: ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ…!!

Bollywood: దక్షిణాదిన తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న ఆమె, ఇప్పటికే ప్రమోషన్లలో...

Read out all

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026: ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని...

Read out all

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all
Optimized by Optimole