కర్ణాటక పోలింగ్ అనంతరం పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు..

Karnatakaelections2023: కర్ణాటక ఎన్నికల్లో విజయం ఏ పార్టీ వరిస్తుందన్న ఉత్కంఠకు 24 గంటల్లో తెరపడనుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆయా రీసెర్చ్ సంస్థలు వెలువరచనున్నాయి. ఈనేపథ్యంలోనే పీపుల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి..బుధవారం సా॥ 6.30 గం॥లకు, ఢిల్లీలోని  తెలంగాణ భవన్లో ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఫస్ట్ పోస్ట్ , పీపుల్స్ పల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సర్వే ఫలితాలను మీడియా వేదికగా వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు….

Read More

‘సంఘ్‌’ పరివారానికి ఇందిరమ్మ వారసులతో ఎలాంటి సైద్ధాంతిక విభేదాలు లేవు!

Nancharaiah merugumala senior journalist: దేశంలోని హిందుత్వ శక్తులకు పూర్వపు జర్మన్‌ నాజీలు, ఇటలీ ఫాసిస్టులకు ఉన్న తెలివితేటలు కాని, రాజకీయ సామర్ధ్యంగాని నేడు లేవు. తమకు నిజమైన శత్రువైన గుజరాతీ మహాత్ముడు మోహనదాస్‌ కం గాంధీ హత్యకు ఈ హిందూ మతోన్మాదులు పాల్పడ్డారు. అంతేగాని, తమకు రాజకీయంగా, సైద్ధాంతికంగా అసలు శత్రువులే కాని నెహ్రూ–గాంధీ కుటుంబ సభ్యుల జోలికి సంఘ్‌ పరివార్‌ సంస్థలు ఎన్నడూ పోలేదు. ఈ ‘నయా ప్రజాతంత్ర రాజరిక’ కుటుంబానికి చెందిన మాజీ…

Read More

క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధనకోసం కోటం రెడ్డి పోరుబాట కార్యక్రమం…

NelloreRural: నెల్లూరు రూరల్:   ఎమ్.ఎల్.ఎ. కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పోరుబాట కార్యక్రమం ఏ పార్టీకి అనుకూలంకాని, వ్యతిరేకంకాని కాదని కేవలం క్రిస్టియన్ సమాజానికి మేలు చేసే విధంగా, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమమని  కోటంరెడ్డి అన్నారు. గత నాలుగు సంవత్సరాలలో స్థానిక ఎమ్.ఎల్.ఎ.గా ముఖ్యమంత్రిని కలసి, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి…

Read More

పీపుల్స్ పల్స్ ఎక్స్ క్లూజివ్ రిపోర్ట్..కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత..

Karnatakaelections2023: కర్ణాటకలో మరో మూడు రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్‌ పార్టీకి స్వల్ప ఆధిక్యత కనబరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ అధికార పార్టీ.. కర్ణాటకలో తిరిగి పగ్గాలు చేపట్టలేదు. చరిత్రను మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే, అధికారం చేపట్టి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్ సంస్థ చేపట్టిన ప్రీపోల్‌ సర్వేలో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోంది. మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి…

Read More

పని చేయని బటన్లు ఎన్ని నొక్కితే ఏం ప్రయోజనం?: నాదెండ్ల మనోహర్

Janasena: • వసతి దీవెన, విద్యా దీవెన బటన్లు నొక్కినా నిధులు ఇవ్వలేదు • విద్యార్థుల సరిఫికెట్లు నిలిపివేస్తున్నా పట్టని వైసీపీ సర్కార్ • వేల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం… బటన్లు నొక్కి డబ్బులు వేస్తున్నాం అని ప్రజలను మోసం చేయడంలో వైసీపీ పాలకులు సిద్ధహస్తులని ఎద్దేవా చేశారు జనసేన నాదెండ్ల మనోహర్. వైసీపీ తప్పుడు ప్రకటనలు, విధానాల వల్ల ప్రజలు..  ముఖ్యంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నారని అన్నారు….

Read More

రామబాణం రివ్యూ..

గోపిచంద్ – శ్రీవాస్ కాంబోల తెర‌కెక్కిన చిత్రం రామ‌బాణం. ల‌క్ష్యం ,లౌక్యం వంటి హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న‌ ఈమూవీపై సినీ ప్రేక్ష‌కుల‌తో పాటు ఇండ‌స్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికి తోడు వ‌రుస ప్లాపులతో స‌త‌మ‌త‌మ‌వుతున్న గోపిచంద్.. రామ‌బాణంతో సాలిడ్ హిట్ కొట్టాల‌ని దృఢ‌నిశ్చ‌యంతో ఉన్నాడు. మ‌రీ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈమూవీ ఎలా ఉందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం! కథ: ర‌ఘుదేవ‌పురం అనే గ్రామంలో రాజారామ్‌(జ‌గ‌ప‌తిబాబు) భార్య భువ‌నేశ్వ‌రి(కుష్భు)తో క‌లిసి హోట‌ల్…

Read More

రైతులకు అండగా జనసేన నిలుస్తుంది: నాదెండ్ల మనోహర్

Janasena: అకాల వర్షాలతో పంటలు కోల్పోయి రైతులు ఆవేదనలో ఉంటే వారికి ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం తన బాధ్యతలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విఫలమైందన్నారు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నీట మునిగిన పంటను చూసి బాధలో ఉన్న రైతు తమ ఆవేదనను పంచుకొనే అవకాశం లేకుండా ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేసి, బెదిరింపులకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. మీడియా ముందుగానీ, ప్రతిపక్షాల దగ్గరగానీ మాట్లాడితే పథకాలు తీసేస్తామని రైతులను బెదిరిస్తున్న దాఖలాలు మా…

Read More

తిరుమల తిరుపతి పవిత్రతను జనసేన కాపాడుతుంది: నాగబాబు

Janasena:వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణలో అక్రమంగా దోచుకున్నదంతా జనసేన ప్రభుత్వంలో కక్కిస్తామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు హెచ్చరించారు. వైసీపీ నాయకుల ధన దాహానికి అపవిత్రమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పరిసరాలను జనసేన పాలనలో సరిదిద్దుతామని వెల్లడించారు. స్వార్థపరమైన జీ.ఓ.లు, ఏకపక్ష నిర్ణయాలపై పునః పరిశీలన చేపడతామని అన్నారు. తిరుపతి నియోజకవర్గం జనసేన కార్యవర్గంతో బుధవారం జరిగిన “వర్చువల్” సమావేశంలో నాగబాబు మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల…

Read More

ప్రజా సమస్యల కోసం కృషి చేసే నాయకుడిని: కోటంరెడ్డి శ్రీధర్

NelloreRural: ఐదేళ్లకోసారి కనిపించే నాయకున్ని కాదని..నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలకై కృషి చేసే నాయకుడినని అన్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంగళవారం ఎమ్మేల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందన్నారు.ఇక ఏ మాత్రం అధికార పార్టీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి…

Read More

రాజకీయ తాకట్టులో ఆంధ్రప్రదేశ్ : భీశెట్టి బాబ్జి

APpolitics: తమను ఆరాధించే కార్యకర్తలే ఆశ్చర్యపోయేలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నాయకులు ‘యూ’ టర్నులు తీసుకుంటున్నారు.పూటకో నాటకం ఆడుతున్న వారి స్వార్థ రాజకీయాలను చూసి వారి అభిమానులకు ఏమీ పాలుపోవడం లేదు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తీవ్ర ద్రోహం చేసిన బీజేపీకి రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు ‘బీ’ టీమ్‌గా మారడం శోచనీయం. దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ అంటే బీ-బాబు, జే-జగన్‌, పీ-పవన్‌ అనేలా అర్థం…

Read More
Optimized by Optimole