2047 నాటికి ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా ‘‘భారత్’’: బండి సంజయ్

తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం మాత్రం వేల కోట్ల ఆస్తులు సంపాందించిందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే… 2014కు ముందు కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక సంపాదించిన ఆస్తులెన్ని? వివరాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాలకు ముందే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి రాష్ట్ర ఆర్దిక పరిస్థితి, నేటి ఆర్దిక పరిస్థితి, తీసుకొచ్చిన అప్పులు, వాటిని…

Read More

నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్.. నెక్స్ట్ ఎవరో..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఆక‌స్మిక బ‌దిలీపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది.. మొన్న సుబ్రమణ్యం …నిన్న గౌతమ్ సావాంగ్..నేడు సునీల్ నెక్స్ట్ ఎవరో..? అన్న చ‌ర్చ అధికార‌, రాజ‌కీయ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. ఎన్నిక‌ల‌కు ఏడాది గ‌డువు ఉండ‌టం.. ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారంలో దూకుడు పెంచ‌డం.. ఇంటా బ‌య‌టా జ‌గన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు పెర‌గ‌డం చూస్తుంటే.. సీఐడీ చీఫ్ ల బ‌దిలీల వెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉండ‌వ‌చ్చ‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయం. కాగా సునీల్ కుమార్…

Read More

యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలి:  జేడి లక్ష్మీనారాయణ

నల్గొండ:యువత  దేశభక్తిని బాల్యం నుంచే అలవరుచుకోవాలని హితవు పలికారు  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. నల్లగొండలో జనగణమన ఉత్సవసమితి ఆధ్వర్యంలో జనగణమణ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమ  ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జండా ఎగురవేశారు. అనంతరం జాతీయ సమైక్యత మీద జరిగిన పోటీలలో ఎంపికైన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. లక్షలాదిమంది త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందని.. అలాంటి…

Read More

నాగోబా జాత‌ర విశిష్ట‌త‌.. పురాణా గాథ‌..

  ప్రపంచలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా. సర్పజాతిని పూజించడమే ఈ జాతర ప్రత్యేకత. రాజ్ గోండ్ ఆది వాసీ తెగ‌లోని మేస్త్రం వంశ‌స్తులు ప్ర‌తి ఏడాది ఈజాత‌ర‌ను నిర్వ‌హిస్తారు.ఈ రోజున తమ ఆరాధ్య దైవం ‘ నాగోబా ‘(శేష నారాయణమూర్తి) పురివిప్పి నాట్యమాడుతాడని గిరిజనులు నమ్మకం. తెలంగాణ‌, ఛ‌త్తీస్ గ‌డ్‌, మ‌హారాష్ట్ర ,ఒరిస్సా నుంచి ప్ర‌జ‌లు వేలాదిగా ఈ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చి మొక్కులు తీర్చుకుంటారు. పురాణాగాథ‌… నాగోబా చ‌రిత్ర‌కు సంబంధించి ఓక‌థ ప్రాచుర్యంలో ఉంది.పూర్వం మేస్రం…

Read More

చిన్న సాయం – పెద్ద మేలు – ఓ సైకిల్..

ఏడో తరగతి దాటితే… ఇక చదువు లేదు అప్పుడు మా ఊళ్లో! 3 కిలోమీటర్ల పొరుగునున్న రంగంపేట వెళితేనే హైస్కూల్ ! రెండు చెరువు కట్టల మీదుగా… పొలాలు, గట్లు, బీడు/పంట చేలు దాటుకుంటూ అలా ఏడాది పాటు, 8వ తరగతి, రోజూ వెళ్లి-వస్తూనే చదివేశా! ఇక, 1976-77 తొమ్మిదో తరగతి సగమయ్యాక అనుకుంటా… మా అన్న గట్టిగా సిఫారసు చేస్తే, బాపు సైకిల్ ఇప్పిచ్చాడు. మా డీజిల్ పంపుసెట్ మెకానిక్ కైర్(సాబ్), సికింద్రాబాద్ వెళ్లి, కొత్త…

Read More

పీపుల్స్ ప‌ల్స్ ట్రాక‌ర్ పోల్ స‌ర్వే రిపొర్ట్ ..ఎస్టీ నియోజకవర్గాల్లో వైసీపీదే హవా …

ఆంధ్రప్రదేశ్‌ ఎస్టీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హవా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పుటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో 6 వైఎస్‌ఆర్‌సిపి.. 01 టిడిపి గెల్చుకునే అవకాశాలున్నట్లు పీపుల్స్ ప‌ల్స్ రీసెర్చ్ సంస్థ వెల్ల‌డించింది. తాజాగా సంస్థ ప్ర‌తినిధులు ఆయా నియోజవకర్గాల్లో ప‌ర్య‌టించి ట్రాక‌ర్ పోల్ స‌ర్వే నిర్వహించగా.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు 44.25 శాతం, టిడిపికి 39.39 శాతం, జనసేన 8.19 శాతం ఓట్లు పొందే అవకాశామున్నట్లు తేలింది.   కాగా…

Read More

క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్..

_ క్యాడర్ ను కాపాడుకోలేని స్థితిలో కాంగ్రెస్ _ చే…జారుతున్న కౌన్సిలర్లు _ సర్జరీ తో దామన్న ఇంటికి పరిమితం _ అయోమయంలో కాంగ్రెస్ క్యాడర్ Suryapeta:  సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాడరు ను కాపాడుకోలేక సతమతమవుతుంది.తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే పలు గ్రూపులుగా ఏర్పడిన నాయకులు రోజుకు ఒక పంచాయతీని తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే! తాజాగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ముందట కొందరు సీనియర్ నాయకులు గొడవ పడిన సంగతి సామాజిక మాధ్యమాలు మీడియా…

Read More

Ycp ప్రభుత్వ ఆర్డినెన్సు హర్షం: గిడుగు రుద్రరాజు

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక చట్టాన్ని పొడిగిస్తూ ycp ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకు రావడంపై హర్షం వ్యక్తం చేశారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఈ ఆర్డినెన్సు ఇచ్చిందన్న ఆయన.. ఇది దళిత గిరిజన శక్తుల పోరాట విజయమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో..”ఎస్సీ ఎస్టీ స్పెషల్ డవలప్మెంట్ ఫండ్” పేరుతో కట్టుదిట్టమైన చట్టం తీసుకురావడం తోపాటు.. ఎస్సీ ఎస్టీ లకి కేటాయించే నిధులను దారి మల్లించకుండా కఠిన…

Read More

జగన్ ని వణికిస్తోన్న లోకేశ్ పాదయాత్ర పాట..!

ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అధికారం సొంతం చేసుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ తన అస్త్రాలకు పదును పెడుతోంది. యువగళం పాదయాత్ర ద్వారా లోకేశ్ ప్రజల్లోకి వెళుతున్నారు. దీనికి తోడుగా, వీలైనన్నీ ఎక్కువ దారుల్లో ప్రజల్లోకి చేరుకోవడానికి, జగన్ పాలనను ఎండగట్టడానికి ప్రయత్నాలు ఉధృతం చేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బాగా వినపడుతోన్న రవితేజ నటించిన ధమాకా సినిమాలోని జింతక పాటకు పేరడిగా లోకేశ్ పాదయాత్ర పాటను రూపొందించారు తెలుగుదేశం అభిమానులు. ’’జెండా పట్టబుద్ధాయితాంది… లోకేశో…. జై కొట్ట…

Read More

రాయ్ పూర్ వన్డేలో భారత్ ఘననిజయం..

రాయ్ పుర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 108 పరుగులకే కుప్పకూలింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేయగా..గత మ్యాచ్ డబుల్ సెంచరీ హీరో శుభ్ మన్ గిల్ 40, ఇషాన్ కిషన్ 8 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. షమికి మ్యాన్ ఆఫ్ ది…

Read More
Optimized by Optimole