బాబు అరెస్టుతో టీడీపీకి దక్కేది మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా?

Nancharaiah merugumala senior journalist: “జగన్‌ 39–40 ఏళ్ల వయసులో జైలులో 16 నెలలు గడిపొస్తే..67 అసెంబ్లీ సీట్లొచ్చాయి..73 ఏళ్ల చంద్రబాబు 52 రోజుల నిర్బంధం తర్వాత ఆర్నెల్లకు జరిగే ఏపీ ఎన్నికల్లో టీడీపీకి దక్కేది ఏభయి రెండా? అరవై ఏడా? మెజారిటీకి అవసరమైన 88 స్థానాలా? “ ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు భారత లోక్‌ సభ 18వ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ 16వ ఎన్నికలకు దాదాపు ఐదున్నర నెలల…

Read More

కేటీఆర్ చేతుల మీదుగా మిర్చి 98.3 పవరాన్ షో ప్రారంభం

Radiomirchi :అత్యుత్తమ కంటెంట్, వినూత్న రీతిలో అందించే 98..3 రేడియో మిర్చి… ‘‘మిర్చి పవరాన్’ పేరిట మరో కొత్త సెగ్మెంట్ ని ముందుకు తీసుకొచ్చింది. పేరులో పవర్ ఉన్నట్టుగానే, శ్రోతలను చార్జ్ చేసే విధంగా అతిథులతో ఈ షో ఉంటుంది. ఎలాంటి రాజకీయాలు మాట్లాడుకోకుండా, కేవలం ప్రేరణ అందించే కంటెంట్ అందించాలని, మిర్చి తెలుగు కంటేంట్ లీడర్ వాణి మాధవి అవసరాల ‘మిర్చి పవరాన్’ సెగ్మెంట్ ని సృష్టించారు. దీనికోసం వివిధ రంగాల్లో ఎదిగిన లీడర్ల యొక్క…

Read More

‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళమేనా?

Naralokesh:టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  ‘యువగళం ‘ పాదయాత్ర కి మంగళం పాడినట్లేనా? పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన పాదయాత్ర కొనసాగే దాఖలాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాబు అరెస్ట్ తో గల్లీ వదిలేసి ఢిల్లీలో తిష్ట వేసిన లోకేష్ లో ..ఎంతసేపూ కేంద్ర పెద్దల మెప్పు పొంది కేసుల నుంచి  ఎలా బయట పడలనే తాపత్రయమే కనిపిస్తోందని పార్టీలో బయట గుసగుసలు వినిపించాయి….

Read More

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి షాక్ ?

దేశంలో ఉత్తరాది ప్రాంతానికి గుండెకాయ లాంటి మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించి హిందీ బెల్టు రాష్ట్రాలలో తన పట్టు సడలేదని నిరూపించుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంటే, ఇక్కడ పగ్గాలు చేపట్టి ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందనే సంకేతాలివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 సీట్లు…

Read More

చంద్రబాబుకు ‘అనారోగ్యం’ పై ఒక్కో కులం పత్రిక ఒక్కోలా చెబితే ఎలా ?

Nancharaiah merugumala senior journalist: చంద్రబాబుకు ‘అనారోగ్య’ కారణాలపై బెయిలు–అని ‘ఈనాడు, జ్యోతి’ చెబుతుంటే…‘ఆరోగ్య’ కారణాల దృష్ట్యా ఆయనకు బెయిలు మంజూరైందని ‘సాక్షి’ వెల్లడించింది!ఒక్కో కులం పత్రిక ఒక్కో రకంగా చెబితే మామూలు తెలుగోళ్లు ఏమైపోవాలి? గత 52 రోజులుగా రాజమహేంద్రి జైల్లో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసిందని ఆంధ్రా మూలాలున్న మూడు తెలుగు దినపత్రికల వెబ్‌సైట్లు తెలిపాయి. అయితే, రెండు ‘వ్యవసాయధారిత’…

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌ కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు..

Nancharaiah merugumala senior journalist: ‘తెలంగాణలో బీఆర్ఎస్‌ నిస్సందేహంగా ముందుంది, దాని పునాది చెక్కుచెదర లేదు..కాంగ్రెస్‌ పుంజుకుని కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు’..సెఫాలజిస్ట్‌ సంజయ్‌ కుమార్‌ మాటలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితికే అద్దంపడతాయి! ‘‘తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆరెస్సే ఖాయంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ కోలుకుని ముందుకు పోవడం లేదు. రాష్ట్రంలో 2014 జూన్‌ నుంచీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆరెస్‌ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి విస్తృతమైన…

Read More

కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!

Nancharaiah merugumala senior journalist:(కుత్బుల్లాపూర్‌ గౌడ ‘కూన’లు ఎంతగా కలబడినా ‘కొలను’ రెడ్డికి ఫాయిదా ఉండదు!ఇది హైదరాబాద్‌ మెట్రోపాలిటన్ ఏరియా..కాకినాడ రూరలో, రామచంద్రపురమో కాదు!!) ===================== గురువారం సూరారం రాంలీలా మైదానంలో– జాబిలీ హిల్స్‌లో భూమి విలువేగాక, హైదరాబాద్‌ నగర శివార్లలోని నేల ఖరీదెంతో తెలిసిన ఓ కృష్ణా జిల్లా ‘సెటిలర్‌’ యాజమాన్యంలోని ఓ తెలుగు టీవీ న్యూజ్‌ చానల్‌ నిర్వహించిన బహిరంగ చర్చలో ఒకే కులానికి చెందడమేగాక ఒకే ఇంటి పేరున్న ప్రస్తుత ఎమ్మెల్యే కూన…

Read More

కర్ణాటక మంత్రి తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!

Nancharaiah merugumala senior journalist:(పశ్చిమగోదావరిలో మూలాలున్న కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు ఎన్నికల ‘స్పెషలబ్జర్వర్‌’గా ..తెలంగాణ ‘కాంగ్రెస్‌ ప్రజా పంపిణీ వ్యవస్థ’ను ఎంత సమర్ధంగా నడిపిస్తారో!) =================== తెలంగాణ శాసనసభ మూడో ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రత్యేక పరిశీలకులు ఇద్దరిలో ఒకరిగా కర్ణాటక చిన్న తరహా నీటిపారుదల శాఖా మంత్రి నడింపల్లి ఎస్‌ బోసు రాజు గారిని శనివారం కాంగ్రెస్‌ ఐ కమాండ్‌ నియమించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం మోగల్లులో పుట్టి పెరిగిన ఈ కాంగ్రెస్‌…

Read More

ఆంధ్రప్రదేశ్‌ ‘ బీసీ’ లకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో టికెట్లు ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’..!

Nancharaiah merugumala senior journalist: (తెలంగాణ బీసీలకు ‘ఎక్కువ’ టికెట్లు హైదరాబాద్‌ పాత బస్తీలో ఇస్తుంటే..ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర మూడు ఉమ్మడి జిల్లాల్లోనే ఇవ్వడం ‘చక్కటి వ్యూహం’!) =≠====≠======== పెద్దలు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ గారు, మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్‌ ఇదివరకే చెప్పినట్టు కాంగ్రెస్‌ పార్టీ తన మొదటి జాబితాలోని 12 మంది ఓబీసీల్లో ఐదుగురికి హైదరాబాద్‌ పాత నగరంలోని అసెంబ్లీ స్థానాల టికెట్లు కేటాయించి చేతులు దులిపేసుకుంది. 55 మంది అభ్యర్థుల తొలి లిస్టులో బీసీలకు డజను…

Read More

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read More
Optimized by Optimole