టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులు అరెస్ట్…

ఏపీ టీడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో దాడికి పాల్పడిన 10 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. శేషగిరి, పవన్‌, అడపాల గణపతి, షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్‌, పానుగంటి చైతన్య, పల్లపు మహేశ్‌, పేరూరి అజయ్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరోవైపు పట్టాభి నివాసంపై దాడి కేసులోనూ 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Read More

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నివేదా థామస్..

నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి నివేదా థామస్ ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శనివారం ఆమె ఓ ట్వీట్‌ చేశారు. ‘ ఆఫ్రికాఖండంలోని కిలిమంజారోని అధిరోహించాను’’ అంటూ ఆమె ఓ ఫొటో షేర్‌ చేశారు. చిన్నప్పటి నుంచి నివేదాకు ట్రెక్కింగ్‌ అంటే ఆసక్తి ఎక్కువ. కిలిమంజారో అధిరోహించాలనే లక్ష్యంతో ఆమె ఆరు నెలలపాటు ట్రెక్కింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఇక, సినిమాల విషయానికి వస్తే…

Read More

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై దాడికి నిరసనగా నేతల నిరసనలు..

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు దాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ పార్టీ ఓడిపోతుందనే భయంతోనే అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తు్న్నారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బీజేపీ గెలుపును అడ్డుకోవడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గంలో వేల కోట్లు చేశారని.. అయినప్పటికి నియోజకవర్గ ప్రజలు ఈటల రాజేందర్ వెంట…

Read More

ధోని మెంటర్ గా ఉండడం టీమ్ ఇండియాకు ఎంతో మేలు..

టీమిండియాకు మెంటర్ గా ధోని ఉండటం యువ ఆటగాళ్లకు ఎంతో మేలు చేస్తుందని వారు భారత మాజీ ఆటగాడు సురేష్ రైనా. ప్రస్తుతం భారత జట్టు లో నాటకాలు అందరూ ఇటీవల జరిగిన ఐపీఎల్లో ఆడారు. ధోనీ సైతం టోర్నీలో పాల్గొన్నాడు. కాబట్టి యూఏఈ పరిస్థితులకు తగట్టు ప్రణాళికలు రచించడం సులువు అవుతుందని తెలిపారు. కాగా యువకులతో కూడిన జట్టుతో ధోని 2007 టి 20 ప్రపంచ కప్ గెలిచిన విషయాన్ని రైనా ఈ సందర్భంగా గుర్తు…

Read More

మా ఎన్నికలపై ట్విట్టర్లో స్పందించిన ప్రకాశ్ రాజ్..

సాధారణ రాజకీయ ఎన్నికలను తలపించిన మా ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. కొత్త కార్య‌వ‌ర్గం ప‌గ్గాలు చేప‌ట్టింది. అయినా మా ఎన్నిక వేడి ముగిసిపోలేదు. ఓటమి పాలైన ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ మాత్రం అన్యాయంగా, అరాచ‌కత్వంతో విష్ణు ప్యానెల్ గెలుపొందింద‌ని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు పోలింగ్ బూత్ సీసీ కెమెరాల్లో నిక్షిప్త‌మ‌య్యాయ‌నీ, వాటిని మాకిమ్మ‌ని ప్ర‌కాష్‌రాజ్ ఇప్ప‌టికే మా ఎన్నిక‌ల అధికారిని కోరారు. అయితే, మొద‌ట నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఇస్తామ‌ని చెప్పిన ఎన్నిక‌ల అధికారి… ఇప్ప‌టి వ‌ర‌కూ…

Read More

మా ఎన్నికల్లో మరో ట్విస్ట్..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కీలక మలుపు తిరిగింది. ఎన్నికల సందర్భంగా వైసీపీకి చెందిన ఒక వ్యక్తి ఎన్నికల హాల్ లో ఉన్నాడని ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ప్రకాశ్ రాజ్ ఫిర్యాదు చేశారు. విష్ణు ప్యానల్ బ్యాడ్జి పెట్టుకుని ఆయన హల్ చల్ చేశారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఆ వ్యక్తి పేరు నూకల సాంబశివరావు అని, జగ్గయ్యపేటకు చెందిన వాడని తెలిపారు. జగ్గయ్యపేట పీఎస్ లో ఆయనపై రౌడీషీట్ కూడా ఉందని చెప్పారు….

Read More

బాలీవుడ్ నటిని మరోసారి విచారించిన ఎన్సీబీ..

బాలీవుడ్ నటి అనన్య పాండే,బాలివుడ్ బాద్‌షా షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మ‌ధ్య న‌డిచిన వాట్సాప్‌ చాట్‌లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అన‌న్య‌ను ప్రశ్నించారు. ఈ విచార‌ణ‌లో డ్ర‌గ్స్ గురించి ఆర్య‌న్‌తో జోక్ చేసిన‌ట్లు అన‌న్య తెలియ‌జేశార‌ని స‌మాచారం. అనన్య పాండే, ఆర్యన్ ఖాన్ మధ్య చాట్ మెసేజ్‌లను ఎన్‌సిబి రికవరీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ఇద్దరూ గంజాయిని సేకరించడం గురించి చర్చించార‌ని ఎన్‌సీబి తెలియ‌జేసింది. వీరిద్ద‌రి సంభాష‌ణ‌లో… జుగాడ్ ఉందా అని ఆర్యన్ ఖాన్ అన‌న్య‌ను…

Read More

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు: వాతావరణ శాఖ

రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. కాగా నేడు,రేపు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల…

Read More

ఉత్తరఖాండ్ను ముంచెత్తిన వరదలు..

ఉత్తరాఖాండ్ ను వరదలు ముంచెత్తాయి. రోడ్లు వాగులను తలపించాయి. కార్లు, బండ్లు కొట్టుకుపోతుండటంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉత్తరాఖాండ్ కాతగోడెంలో రైల్వే ట్రాకు వెంబడి వాగు వదర ఉధృతికి ట్యాకులు కొట్టుకుపోయాయి ఇప్పుడీ విడియో వైరల్ గా మారింది.

Read More

కేసిఆర్ మరోసారి దళితులను మోసం చేశారు: బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతు బంధు పథకాన్ని ఈసీ నిలిపివేసిన నేపథ్యంలో తెలంగాణ సర్కారుపై మండిపడ్డారు. వరుస ట్వీట్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కేసీఆర్ వైఫల్యం వల్లే దళిత బంధు పథకాన్ని నిలిపివేస్తూ ఈసీ ఆదేశాలిచ్చిందని మండిపడ్డారు.దళితులను మరోసారి మోసం చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తన కుట్ర బుద్దితోనే దళితబంధు పథకం కింద ఒక్కరికి కూడా నిధులు…

Read More
Optimized by Optimole