Telangana: బిఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న కవిత…!

Telangana: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లపై బీఆర్ఎస్ ఆశ‌లు వ‌దులుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పార్టీలో నెల‌కొన్న అంత‌ర్గ‌త క‌ల‌హాలు, కేసీఆర్‌ కుటుంబ స‌మ‌స్య‌లు, స్థానిక నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో బీఆర్ఎస్ స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. వీటికి తోడు తాజాగా బీఆర్ఎస్‌ను క‌ల్వ‌కుంట్ల క‌విత టెన్ష‌న్ పెడుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక‌లో క‌విత పోటీ చేయ‌బోతున్నార‌నే ప్ర‌చారం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌పెడుతున్న‌ట్టు స‌మాచారం. బీఆర్ఎస్‌ను వీడిన అనంత‌రం క‌విత‌ కొత్త రాజకీయ పార్టీ స్థాపించేందుకు…

Read More

Hyderabad:బీసీ రిజర్వేషన్లపై గందరగోళం…!

హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుతూ చేసిన చట్ట సవరణపై గవర్నర్ ఆమోదముద్రకు సంబంధించి గందరగోళం నెలకొంది. తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) చట్టం–2025 బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సవరణలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, నల్గొండ జిల్లాలోని హాలియా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపేటను కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే, గ్రామీణ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల సడలింపుకు ఉద్దేశించిన…

Read More

Hyderabad: కవిత సస్పెన్షన్ బిఆర్ఎస్ గుంట నక్కల కుట్ర…?

హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఇటీవల కనిపిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత వ్యక్తిత్వ హననం కోసం కొందరు పద్ధతి ప్రకారం కుట్రలు పన్నుతున్నారని పార్టీ అంతర్గత వర్గాలే ఆరోపిస్తున్నాయి.కుట్రలో భాగంగానే కవిత సస్పెన్షన్ జరిగిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. మొదటగా ఒక స్వయంప్రకటిత మేధావి ద్వారా కవితపై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయించి, ఆ వీడియోలను కార్యకర్తల చేత సోషల్ మీడియాలో వైరల్‌ చేశారు. దీంతో కవితను…

Read More

Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ?

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పోటీ చేసే అవకాశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత స్వయంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై దృష్టి సారించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తన శక్తిని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల టాక్‌. ఇందుకోసమే ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..కవిత నిజంగా బరిలోకి దిగితే, ఆమె విజయావకాశాలు ఎలా ఉన్నా,…

Read More

Telangana: బంతి మోదీ కోర్టులో? బీజేపీలో బీఆర్ఎస్‌ విలీనం?

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం అవినీతి కేసు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ ప్రధాన నేత హరీష్‌ రావు పాలిట ఈ కేసు గుది బండలా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మొదట్లో రేవంత్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమీషన్‌ విచారణను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నామని ప్రకటించగానే కేసీఆర్‌, హరీష్‌ రావు అలర్ట్‌ అయ్యారు. హైకోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకోవాలనుకున్నారు. సీఐడీకి అప్పగించినా…

Read More

క‌ల్వ‌కుంట్ల క‌విత విష‌యంలో బీజేపీ అదే వ్యూహాన్ని అమ‌లు చేస్తుందా..?

Telangana: రాజ‌కీయ ఎదుగుద‌ల కోసం ఏవ‌రినైనా స‌రే పార్టీలో చేర్చుకోవ‌డంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ముందుంటుంద‌నేది బ‌హిరంగ ర‌హస్యం. ఒక పార్టీతో విభేదించిన నేత‌ల‌ను, ఒకే పార్టీలో ఉండి కుటుంబ స‌భ్యుల‌తో విభేదించిన‌ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డానికి ఆ పార్టీ వెనుకాడ‌దు. ఇది దేశ వ్యాప్తంగా నిరూపిత‌మైన బీజేపీ వ్యూహం. అవినీతి మ‌ర‌క‌లున్న నేత‌లు కూడా త‌న వ్యూహానికి మిన‌హాయింపు ఏమీ కాదు. ఇప్పుడు క‌ల్వ‌కుంట క‌విత విష‌యంలో బీజేపీ ఆ సంప్ర‌దాయాన్ని అనుస‌రిస్తుందా..? లేదా..? అనేది…

Read More

క‌విత వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు – బీఆర్ఎస్‌కు మ‌రింత న‌ష్టం చేసేలా స్కెచ్‌..!

Telangana: బీఆర్ఎస్ నుంచి సస్పెన్ష‌న్‌కు గురైన ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ క‌విత ఎమ్మెల్సీ స‌భ్య‌త్వానికి, పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అయితే దీనిపై బుధ‌వారం మీడియాతో మాట్లాడిన క‌విత చివ‌ర్లో వ్యూహాత్మ‌కంగా “జై కేసీఆర్” నినాదాన్ని ఎత్తుకున్నారు. క‌విత ఈ నినాదాన్ని కాక‌తాళీయంగా చేసిన‌ది కాద‌ని, జై కేసీఆర్ అని పార్టీ నుంచి స‌స్పెండ్ అయిన త‌రువాత కూడా నిన‌దించ‌డం ద్వారా బీఆర్ఎస్‌లోని అసంతృప్తి వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పికొనేందుకు ఆమె వ్యూహాత్మ‌క అడుగులువేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.  కేసీఆర్‌పై గౌర‌వం…

Read More

Telangana: కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరం అవినీతి రుజువైంది: మహేష్‌కుమార్ గౌడ్

హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ సీఎం రేవంత్‌రెడ్డి పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కవిత చేసిన వ్యాఖ్యలతో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. “కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేక హరీశ్‌ రావా? అనేది మాకు సంబంధం లేదు. వారి హయాంలోనే స్కాం జరిగిందనేది కవిత మాటలతో రుజువైంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే? కాళేశ్వరం అవినీతిలో మామ కేసీఆర్‌ వాటా ఎంత..?…

Read More

BRS: అవినీతి అనకొండలు హరీశ్–సంతోష్: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు “అవినీతి అనకొండలు” అంటూ కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. “కేసీఆర్ కు తిండి, డబ్బుల మీద ధ్యాస ఉండదు. కానీ ఆయన పక్కన ఉన్న వారివల్లే అవినీతి మరక అంటింది. నేడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ను విమర్శించే పరిస్థితి రావడానికి కారణం హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి” అని కవిత ఆరోపించారు. ప్రస్తుతం…

Read More

Telangana: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ దర్యాప్తు…!!

Hyderabad: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు శాసనసభలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆధ్వర్యంలో నియమించబడిన విచారణ కమిషన్ తన నివేదికను జూలై 31న ప్రభుత్వానికి సమర్పించింది. అనంతరం ఆగస్టు 4న మంత్రివర్గం ఆ నివేదికను ఆమోదించి, శాసనసభ చర్చకు పెట్టింది. 665 పేజీలతో కూడిన నివేదికలో…

Read More
Optimized by Optimole