మాచర్ల లో హై అలెర్ట్.. బ్రహ్మారెడ్డి గుంటూరు తరలింపు..!!

పల్నాడు: పల్నాడు జిల్లా మాచర్ల రణరంగంగా మారింది.అధికార వైసీపీ , ప్రతిపక్ష టిడిపి పార్టీల నేతలు ఒకరిపై మరొకరు దాడులతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి ఇదే ఖర్మ ప్రోగ్రాం చేపట్టిన తరుణంలో.. ఇందుకు ధీటుగా వైసిపి  శ్రేణులు జైపీఆర్కే నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో మొదలైన రగడ.. ఒకరిపై మరొకరు రాళ్ళు, కర్రలతో  దాడులు చేసుకునేంతవరకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లర్లను అదుపు చేసి.. 144 సెక్షన్ అమలు చేశారు.  …

Read More

జగన్మోండిపై జనసేనాని బ్రహ్మస్త్రాలు..

  ఒక్క ఫొటో వేల మాటలతో సమానం అయితే, ఒక్క కార్టూన్‌ లక్షలమంది భావోద్వేగాలను చూపించే సాధనం. అక్షరం చిత్రంతో కలిసినప్పుడు అది బతుకు చిత్రానికి ప్రతీకే అవుతుంది.  నలిగిపోతున్న ఆంధ్ర ప్రజల బతుకు చిత్రాన్ని,  విరిగిపోయిన ఏపీ అభివృద్ధి రథాన్ని, పెరిగిపోతున్న వైసీపీ నియంతృత్వ పోకడను అలాంటి కార్టూన్‌ అస్త్రంతో ఎదుర్కొంటోంది జనసేన. గత ఆరేడు నెలలుగా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తో పాటు, జనసేన అధికారిక ట్విటర్‌ ఖాతాల్లో వైసీపీ ప్రభుత్వంపై సంధిస్తున్న కార్టూన్లు ఏపీ ప్రజల మనోగతాన్ని బయటపెడుతూ, వారి…

Read More

బండి ఆరో విడత పాదయాత్రకు సన్నద్ధమవుతున్న కమలదళం..

తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర గ్రాండ్ సక్సెస్ కావడంతో  బిజెపిలో జోష్ కనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలో తృటిలో విజయం చేజారడంతో క్యాడర్ కొంత నిరాశ చెందింది.ఇప్పుడు  ఐదో విడత పాదయాత్రకు ప్రజల నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడం చూసి..తదుపరి పాదయాత్రకు కమలనాథులు సన్నాహాలు చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా వచ్చిన వినతి పత్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ యాత్రను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక సంజయ్ ఐదో విడత…

Read More

బండి సంజయ్ ఎమోషనల్..

ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. కరీంనగర్ బిజెపి కార్యకర్తల కృషితోనే తాను ఎంపీనయ్యానని… బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పజెప్పిందని భావోద్వేగంగా ప్రసంగించారు. కరీంనగర్ గడ్డపై కాషాయం జెండా ఎగరడంతో..దేశం ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  బండి సంజయ్ అంటే ఎవరు.. ఎవరికి తెలుసు..ఎవరు ఓటేస్తారని.. హేళన చేసిన వాళ్లకి.. ఎంపీగా పోటీచేసి.. లక్ష ఓట్ల తో గుబగుయ్యమనిపించేలా సమాధానమిచ్చనట్లు సంజయ్…

Read More

కరీంనగర్ కాషాయమయం..పాదయాత్ర ముగింపు సభ గ్రాండ్ సక్సెస్..

బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా కరీంనగర్ పట్టణం కాషాయ రంగు పులుముకుంది. పట్టణంలో ఎక్కడ చూసిన బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.  సభా  వేదిక…SRR కాలేజ్ ప్రాంగణం భారత్ మాతాకీ జై నినాదాలతో దద్దరిల్లింది. వేదికపై కళాకారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సింగర్ లక్ష్మి గానానికి అనుగుణంగా కాషాయం కార్యకర్తలు తమదైన  స్టెప్పులతో అదరగొట్టారు. ఇక సభ ప్రారంభం కాగానే..  బిజెపి నేతలు  సీఎం కేసిఆర్ పాలనపై తీవ్ర…

Read More

అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ : రేవంత్ రెడ్డి

సీఎం కేసిఆర్ పై టీపీసీసీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని ఆరోపించారు.BRS పేరుతో కేసిఆర్..  అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్  నినాదం ఇచ్చారని..దాని అర్థం అబ్ కీ బార్ లిక్క‌ర్ స‌ర్కార్ అని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటని.. ఆయన కుటుంబానికి లిక్క‌ర్‌కు అవినాభావ సంబంధం ఉందన్నారు. మద్యంతోనే హైదరాబాద్…

Read More

BRS వైరస్..BJP వ్యాక్సిన్: బండి సంజయ్

BRS’ (భారత రాష్ట్ర సమితి) కార్యాలయం ఓపెనింగ్ పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శలు చేశారు. BRS పెయింట్ ఆరకముందే… VRS అవుతుందని ఎద్దేవా చేశారు. BRS ఒక వైరస్ అయితే… ‘బీజేపీ’ అనేది ఒక వ్యాక్సిన్ అన్నారు. దేశ ప్రజలారా…మీకు వ్యాక్సిన్ కావాలా..? వైరస్ కావాలా…? మీరే నిర్ణయించుకోండని కుండ బద్దలు కొట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర _5 ముగింపు సందర్భంగా..కరీంనగర్ SRR కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నామన్నారు.బిజీ…

Read More

కోటంరెడ్డి హ్యాట్రిక్ ఖాయం..!!

ఏపీలో నెల్లూరు రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడి నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుండటంతో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ జిల్లాపై పట్టుకోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి.గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఈనేపథ్యంలోనే పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో చర్చించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ఎమ్యెల్యే పనితీరూ.. వైసీపీ…

Read More

పవన్ ‘ వారాహి’ ప్రకటనతో వైసీపీకి భయం పట్టుకుంది: మనోహర్

వైసీపీ నేతలకు రాజకీయాల మీద ఉన్న శ్రద్ద ప్రజల మీద లేకుండా పోయిందన్నారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్.ఓ పక్క ప్రజలు మాండేస్ తుపాన్ తో ఇబ్బందులు పడుతుంటే..కనీస చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం..దాన్ని వదిలేసి జనసేన పార్టీ వాహనం వారాహి రంగుల మీద మాట్లాడడం అత్యంత శోచనీయమని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు  ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోహర్ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు….

Read More

రేవంత్‌ వంటి రెడ్డి నేతలు హైదరాబాదులో ఉస్తాదులు, వస్తాదులే గాని పార్లమెంటులో ‘శూద్రులేనా’?

 Nancharaiah Merugumala: (senior journalist) ========================= బంగారు తెలంగాణను ఇక ‘పద్మనాయకులే’ కాపాడుకోవాలేమో మరి! డా.మర్రి చెన్నారెడ్డి, టంగుటూరి అంజయ్య తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్న తెలంగాణ రెడ్డి సూదిని జైపాల్‌ రెడ్డి అనేది నా అభిప్రాయం. కాని, ఈ పదవి సోనియా జీ ఇస్తానన్నా ఆయన కాదన్నారు. అదే వేరే విషయం అనుకోండి. ఇప్పుడు మల్కాజిగిరి కాంగ్రెస్‌ లోక్‌ సభ సభ్యుడు అనుముల రేవంత్‌ రెడ్డి (53) నిన్న పార్లమెంటు దిగువసభలో కేంద్ర…

Read More
Optimized by Optimole