×

 

॥ శ్రీ జగన్నాథ ప్రార్థనా ॥

రత్నాకరస్తవ గృహం గృహిణీ చ పద్మా కిం దేయమస్తి భవతే పురుషోత్తమాయ । ? అభీర?వామనయనాహృతమానసాయ దత్తం మనో యదుపతే త్వరితం గృహాణ ॥ ౧॥

భక్తానామభయప్రదో యది భవేత్ కిన్తద్విచిత్రం ప్రభో కీటోఽపి స్వజనస్య రక్షణవిధావేకాన్తముద్వేజితః । యే యుష్మచ్చరణారవిన్దవిముఖా స్వప్నేఽపి నాలోచకా- స్తేషాముద్ధరణ-క్షమో యది భవేత్ కారుణ్యసిన్ధుస్తదా ॥ ౨॥

అనాథస్య జగన్నాథ నాథస్త్వం మే న సంశయః । యస్య నాథో జగన్నాథస్తస్య దుఃఖం కథం ప్రభో ॥ ౩॥

యా త్వరా ద్రౌపదీత్రాణే యా త్వరా గజమోక్షణే । మయ్యార్తే కరుణామూర్తే సా త్వరా క్వ గతా హరే ॥ ౪

॥ మత్సమో పాతకీ నాస్తి త్వత్సమో నాస్తి పాపహా । ఇతి విజ్ఞాయ దేవేశ యథాయోగ్యం తథా కురు ॥ ౫॥

పూరీ జగన్నాథ రథోత్సవం:

రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ అని ఆర్షోక్తి. అంటే ‘దివ్య రథంపై ఊరేగుతున్న విష్ణువును దర్శించుకొన్నవారికి పునర్జన్మ ఉండదు’ అని అర్థం. ఇంతటి మహిమ గల రథోత్సవం మహా పుణ్యక్షేత్రం అయిన ‘పూరీ’ దివ్య ధామంలో ప్రతి యేటా ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది. ఆ భవ్యరథంపై ఊరేగే మహావిష్ణువు పేరే జగన్నాథుడు.

పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీక్షేత్రం, శంఖక్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏడాది పాటు గర్భాలయంలోనే కొలువుదీరి ఉండే జగన్నాథుడు రథయాత్ర జరిగే రోజున తన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడితో కలిసి రథం అధిరోహిస్తాడు. ఈ రథయాత్ర ప్రధానాలయం నుంచి ప్రారంభమై మూడు మైళ్ల దూరంలో ఉన్న ‘గుండీచా’ ఆలయం వరకు సాగుతుంది.

వారం రోజులపాటు గుండీచా ఆలయంలో విడిది చేశాక, దశమినాడు ప్రధానాలయానికి తిరిగి చేరుకోవడం రథయాత్ర సంప్రదాయం. జగన్నాథుడు అధిరోహించిన రథాన్ని ‘నందిఘోష’ అని, సుభద్ర రథాన్ని ‘పద్మధ్వజం’ అని, బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అని పిలుస్తారు. ఈ రథాలను ప్రతి సంవత్సరం కొత్తగా నిర్మిస్తారు. ప్రతియేటా అక్షయ తృతీయనాడు ప్రారంభించి, ఆషాఢ శుద్ధ పాడ్యమినాడు ఈ రథాల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిచేస్తారు. ప్రధానాలయంలోని ఈ ముగ్గురు మూర్తులు అధిష్ఠించి ఉండే పీఠాన్ని ‘రత్నపీఠం’ అంటారు. తొలుత బలభద్రుడి విగ్రహాన్ని, తదుపరి సుభద్ర విగ్రహాన్ని, చివరగా జగన్నాథుడి విగ్రహాన్ని రథంపై కూర్చోబెట్టడం ఆనవాయితీ. యాత్రకు రథాన్ని సిద్ధంచేసిన తరవాత పూరీ సంస్థానాధీశులు బంగారు చీపురుతో స్వామి ముంగిట శుభ్రం చేస్తారు. ఆ తరవాత అశేష భక్త జన సందోహం, జయజయ ధ్వానాల హోరులో రథయాత్ర ప్రారంభం అవుతుంది.

పూరీ’ అనే పదానికి పూరించేది అని అర్థం. భక్తుల పాలిట కొంగుబంగారమై, భక్తులు కోరిన కోరికలు తీర్చే దివ్యక్షేత్రం అయినందువల్ల ‘పూరీ’ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయపదం అయిందని భక్తుల విశ్వాసం.

ఈ క్షేత్రంలో కొన్ని విశిష్టతలున్నాయి. ఈ ఆలయ గోపురంపై ఉండే జెండా… వీచే గాలికి వ్యతిరేక దిశలో కదులుతుంది. గోపురంపైన ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం ఎటునుంచి తిలకించినా మన వైపే చూసినట్లు ఉంటుంది. ఈ ఆలయంపై పక్షులు ఎగరకపోవడం ఒక వింత. ఈ ఆలయ గోపురం నీడ సూర్యుడు ఉదయించినా, అస్తమించినా ఎక్కడా కనిపించకపోవడం విశేషం. సాధారణంగా గాలి పగటిపూట సముద్రంపై నుంచి భూమి పైకి వీస్తుంది. సాయంత్రం భూమిపై నుంచి సముద్రం పైకి వీస్తుంది. కానీ ఈ క్షేత్రంలో దీనికి విరుద్ధంగా గాలి వీస్తుంది. పూరీ ఆలయంలో స్వామికి నివేదనకు ముందు ప్రసాదం ఎలాంటి వాసనా ఉండకపోవడం విచిత్రం. స్వామికి నివేదించిన తరవాత సువాసనలు వస్తాయి. గుడిలోని జగన్నాథ, సుభద్ర, బలభద్రుల విగ్రహాలు చెక్కతో చేసినవి కావడం విశేషం.

రథయాత్ర ముగిసే గుండీచా ఆలయం దగ్గర రథం తనంతట తానే ఆగిపోవడం ఒక మహిమ. జగన్నాథుడికి నివేదించే 56 రకాల పదార్థాలను(ప్రసాదాలను) మట్టి కుండలలోనే వండుతారు. ఆలయానికి అత్యంత సమీపంలోనే సముద్రం ఉన్నా, ఆలయం లోపల సముద్ర అలల శబ్దాలు వినబడవు. ఇలా ఎన్నో విశిష్టతలు, రహస్యాలు, మహిమలు కలిగిన పూరీక్షేత్రం మానవాళికి వరప్రసాదమే.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

ఆత్మ ప్రయాణం: మరణానంతరం 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర

Devotional: సనాతన ధర్మం ప్రకారం మరణం అంతం కాదు. అది ఒక దశ ముగింపు… మరో దశకు ఆరంభం.మనిషి శరీరం నశించినా, ఆత్మ నశించదు. తన కర్మల భారంతో, ఆశయాలతో...

Read out all

Karthikamasam: కార్తిక మాసంలో 360 వత్తులు వెలిగించడం ఎందుకు ప్రత్యేకం…?

Karthikadeepam: హిందూ సంప్రదాయంలో దీపదానం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. ప్రత్యేకంగా కార్తికమాసం లో దీపాలను వెలిగించడం అఖండ పుణ్యఫలాన్ని అందిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 360 వత్తులు వెలిగించడం...

Read out all

kumarswamy: సుబ్రహ్మణ్యస్వామి పుట్టుకకు కారణం..?

Kumarswamy: ఆషాఢమాసంలో స్కందపంచమి, కుమారషష్టికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో వచ్చే కుమారషష్టిని రెండు రోజులపాటు ఘనంగా నిర్వహిస్తారు.దీనికి తోడు కుమార షష్ఠి రోజే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మించారని...

Read out all

Varanasi: కాశీ వారాహీ అమ్మవారిని రాత్రి పూటనే ఎందుకు దర్శిస్తారు..?

Devotional:వారణాసి ఆధ్యాత్మిక నిలయంగా ప్రసిద్ధి. ఈ పవిత్ర నగరంలో ఎన్నో మహిమాన్విత దేవాలయాలున్నాయి. కానీ వాటిలోనూ భూగర్భంలో ఉన్న ఒక అద్భుత ఆలయం – ఉగ్ర వారాహీ అమ్మవారి మందిరం....

Read out all

Varahi Navratri: వారాహీ నవరాత్రుల ప్రత్యేకత..!

VarahiNavratri: ఆదిశక్తి అనుగ్రహం కోసం భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. అలాంటి తపస్సుకి శ్రేష్ఠ సమయంగా భావించబడే వారాహీ నవరాత్రులు ఈ జూన్ 26న ప్రారంభమవుతున్నాయి. భూదేవి సంరక్షణ కోసం...

Read out all

Ashadam: ఆషాఢం – ఆధ్యాత్మికతకు మూలం..!

Ashadamasam: చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల మధ్య సంచరించటం వలన దీనికి ‘ఆషాఢం’ అనే పేరు వచ్చింది. అయితే దీనినే శూన్య మాసం అని కూడా పిలుస్తారు....

Read out all
Optimized by Optimole