దేశంలో కరోనా డేంజర్ బెల్స్ .. పెరుగుతున్న కేసులు..

covidcases: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృభిస్తోంది. తాజాగా కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు 142 నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, కేరళ లో కేసులు సంఖ్య అధికంగా ఉన్నట్లు ప్రకటించింది . ఈ రెండు రాష్ట్రాల్లో  వైరస్తో ఐదుగురు..దేశవ్యాప్తంగా ఏడుగురు మృతి చెందినట్లు తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలెర్ట్ చేసింది.మహమ్మారి కట్టడికి పకడ్బందీగా జాగ్రత్తలు చేపట్టాలని.. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను పెంచాలని సూచించింది.

వేరియంట్ లక్షణాలు: కరోనా కొత్త వేరియంట్ j_1 దాదాపు ఒమెక్రాన్ స్ట్రైయిన్ లాగానే కనిపిస్తోంది. దీని వ్యాప్తి కూడా వేగంగా ఉంది. వైరస్ లక్షణాలు పరిశీలించినట్లయితే..

_ ప్రస్తుతానికి వైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనే దానిపై ఇంకా పూర్తిస్థాయి సమాచారం లేదు.

_ డాక్టర్లు చెబుతున్న సమాచారం ప్రకారం పేషెంట్లకు జ్వరం,  ముక్కు కారడం , గొంతులో గరగర లేదా మంట, తలనొప్పి వంటివి ఉంటున్నాయి.

_ కొంతమందిలో గ్యాస్ సమస్యలు

_ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.

ఇక ప్రస్తుతానికి  కరోనా గురించి ఆందోళన లేకున్నా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణుల సూచిస్తున్నారు.ఇంతకుముందు మాదిరిగా తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవడం, మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని హెచ్చరిస్తున్నారు.

 

 

Optimized by Optimole