Nancharaiah merugumala senior journalist:
21 సంవత్సరాల క్రితం అయోధ్యలోని బాబరీ మసీదును దగ్గరుండి మరీ కూలగొట్టడానికి అనుమతించిన లాల్ కిషన్ ఆడ్వాణీ జీకి, అలాగే 1992 డిసెంబర్ 6న ప్రధానమంత్రి హోదాలో హస్తినలోని అధికార నివాసంలో కూర్చుని వివాదాస్పద ముస్లిం కట్టడాన్ని నేలమట్టం చేయడానికి పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాములపర్తి వేంకట నరసింహారావు గారికి భారత రత్న పురస్కారాన్ని వారం రోజుల్లో వెంట వెంటనే ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయం. మసీదు ముందు పట్టపగలే నిలబడి దాని కూల్చివేతకు కారకుడనే నింద భరించిన ఆడ్వాణీకి భారతరత్నను ఆరు రోజులు ముందు ప్రకటించారు.
అయితే, బాబరీ మసీదు నేలమట్టం కావడానికి కేంద్ర ప్రభుత్వాధినేతగా అనువైన వాతావరణం సృష్టించిన పాములపర్తి వారికి మరో దక్షిణాది బ్రాహ్మణ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, ప్రఖ్యాత రైతు నాయకుడు, ఓబీసీ రాజకీయలకు మార్గదర్శి అయిన చౌధరీ చరణ్ సింగ్ తోపాటు ఈ అత్యున్నత భారత పౌర పురస్కారం ప్రకటించడం తెలంగాణ బ్రాహ్మణ సోదరులకు బాధాకర విషయంగా కనిపిస్తోంది.