“ఢిల్లీ ఓటు..నరేంద్రమోదీకే”..!

BJPtelangana: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీల నేతలంతా అస్త్ర శస్త్రాలను  సిద్దం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లోను సత్తచాటలని భావిస్తుంటే..ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ సీట్లు గెలవాలని పట్టుదలగా కనిపిస్తోంది. అటు బీజేపీ మోదీ చరిష్మా మీద నమ్మకంతో గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే..  మరోవైపు పలు సర్వే సంస్థలు క్షేత్రస్థాయిలో  ప్రజానాడి ఎలా ఉందో తెలుసుకునేందుకు   అధ్యయనం  చేపట్టాయి. ఈ సర్వేల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నట్లు తేలింది. ‘ ఢిల్లీ ఓటు…నరేంద్రమోదీకే ‘ ..’ ఢిల్లీ ఓటు బిజేపి కే ‘ .. ఢిల్లీ ఓటు _ పువ్వు గుర్తు కే’ అంటూ ప్రజలు కాషాయం పార్టీకి మద్దతు తెలుపుతున్నారని వెల్లడించాయి. గల్లీ లీడర్ ఎవరైనా సరే_ ఢిల్లీ రాజు మాత్రం మోదీ ఉండాలని బలమైన వాదన ప్రజల నుంచి వ్యక్తమవుతున్నట్లు సర్వే రిపోర్ట్స్  చెబుతున్నాయి.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole