కొత్త త్రిదళాధిపతిగా ఎంఎం నరవణెకే..?

కొత్త త్రిదళాధిపతిని ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్రం. త్రివిధ దళాల సిఫారసు మేరకు అర్హుల జాబితాను త్వరలోనే రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​కు అధికారులు అందజేయనున్నారు. హెలికాప్టర్​ ప్రమాదంలో మరణించిన సీడీఎస్​ జనరల్ బిపిన్​ రావత్ వారసుడ్ని ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేన సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్​ను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఖరారు చేయనుంది.
మరోవైపు కొత్త సీడీఎస్​గా ఎంపికయ్యే అవకాశాలు సైన్యాధిపతి జరనల్ ఎంఎం నరవణెకే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనుభవంలో అందరికన్నా సీనియర్ కావడం వల్ల ఈ పదవి దాదాపు ఆయనకే దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్మీ చీఫ్​గా జనరల్​ బిపిన్​ రావత్​ నుంచి 2019 డిసెంబర్​ 31న నరవణె బాధ్యతలు స్వీకరించారు. 2022 ఏప్రిల్​ వరకు ఆయన పదవీకాలం ఉంది. ప్రస్తుతమున్న వాయుసేన చీఫ్​ మార్షల్​ వివేక్​ రామ్​ చౌదరి ఈ ఏడాది సెప్టెంబర్​ 30నే బాధ్యతలు స్వీకరించారు. నౌకాదళ అధినేత అడ్మిరల్​ ఆర్​.హరికుమార్​ నవంబర్​ 30న ఆ బాధ్యతలను తీసుకున్నారు.
వీరిద్దరు ఈ మధ్యే బాధ్యతలు స్వీకరించడం.. మరోవైపు అనుభవంలో అందరికన్నా సీనియర్ అయిన నరవణెకే ఈ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. త్రిదళాధిపతుల ఎంపికకు అనుసరిస్తున్న విధానాన్నే సీడీఎస్​ ఎంపిక విషయంలోనూ కేంద్రం పాటించనుంది.

Optimized by Optimole