Telangana:KGVB పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి..
SuryaPeta: ప్రభుత్వ పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల పై కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి సూర్యాపేట మండలం ఇమాంపేట (KGVB) కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం,విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందిని అడిగితెలుసుకున్నారు. విద్యార్దినిలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులకు,…
Karimnagar: విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా: బోయినపల్లి ప్రవీణ్
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని కరీంనగర్ బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో గత నెలరోజులుగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వంలో చలనంలేదని మండిపడ్డారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఇంత జరుగుతుంటే సీఎం రేవంత్ స్పందిచకపోవడం విడ్డురంగా ఉందన్నారు. తక్షణమే ఘటనలపై విచారణకు కమిటీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో…
Telangana :విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ చెలగాటం : ఎస్ఎఫ్ఐ
Atmakur: విద్యార్థుల ప్రాణాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆత్మకూర్ మండల ఎస్ఎఫ్ఐ అధ్యక్షులు చరణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శనివారం మండలంలోని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ చేయడం జరిగిందని అన్నారు. గత నెల రోజుల నుండి రాష్ట్రంలోని వివిధ పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలవడం.. చనిపోతూ ఉంటే ఎమ్మెల్యేలు పట్టింపులేనట్లు ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. వరుస ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ తక్షణమే విచారణకు…
INC: కష్టాల కడలి ఈదుతున్న కాంగ్రెస్..!
INC: ‘‘మొదలు మొగురం కానిది కొన దూలమవుతుందా?’’ అని సామెత. దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం ఇలానే ఉంది. మొగురం (స్తంభం) కన్నా దూలం (ఇంటి నిర్మాణంలో మొగురాలపై అడ్డంగా పరిచే బీమ్) వ్యాసపరిధి ఎక్కువ. ఓ చెట్టు ఖాండపు మందం మొగరానికే సరిపోనపుడు, ఇక ఆ చెట్టు కొన దూలానికి సరిపోవడం అసాధ్యమనే అర్థంలో వాడతారు. ఒకటి తర్వాత ఒకటి… రాష్ట్రాల్లో తగులుతున్న ఎదురుదెబ్బలు కాంగ్రెస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతున్నాయి….
literature: జ్ఞాన పరిమళ పుస్తక పుష్పాలు..!
Telugu literature: తెలుగునాట రాజకీయ పుస్తక రచన తక్కువ. సమకాలీన రాజకీయ పరిణామాల మీద విశ్లేషణాత్మకమైనవి మరీ తక్కువ. అధీకృత డాటా, సాధికారిక సమాచారం, తెరవెనుక సంగతులను సమ్మిళితం చేసి వెలువరించిన… వ్యాఖ్యాయుతమైన పుస్తకాలు దాదాపు లేవనే చెప్పాలి. ఒకటీ, అరా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తెలుగు రాజకీయాలకు సంబంధించి తెలుగులోనే కాక ఇంగ్లీషులోనూ లేవు ఎందుకో! సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు వంటి ఒకరిద్దరు రాసిన కొన్ని పుస్తకాలున్నా అవి డాటా ప్రధానమైనవి మాత్రమే! సీనియర్…
MLC2024: ఎమ్మెల్సీ టికెట్ దక్కేదెవరికి .?
MLCElections2024: ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నఅభ్యర్థులు..ఆశావహులు ప్రచారాన్ని మొదలెట్టారు. రోజువారీగా వివిధ కార్యక్రమాల పేరిట ప్రచారం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో సమంగా సీట్లు గెలుచుకున్న అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలను రచించడంలోనిమగ్నమయ్యాయి. మరోవైపు ప్రతిపక్ష బిఆర్ఎస్ ఆరునూరైనా సరే బలమైన అభ్యర్థిని రంగంలో నిలిపి గెలిచి తీరాలని దృడ నిశ్చయంతో కనిపిస్తోంది. టికెట్ కోసం మంత్రుల లాబీయింగ్.. కరీంనగర్,…
Telangana: త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన..!
• త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన • నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్న కమిషన్ • వచ్చే నెల రెండో వారంలో ముగియనున్న గడువు రాపర్తి వినోద్: ఎస్సీల్లో అట్టడుగు స్థాయిలో ఉండి వినతులు అందించలేని వారికోసం చొరవ చూపించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కోరింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో పర్యటన ఉండబోతుందని తెలిపింది. అన్ని వర్గాల నుంచి వినతులు సేకరించిన తర్వాత వారిలో ఒకే…
BJPtelangana: తెలంగాణ బీజేపీ నిద్రమేల్కొనేనా..?
BJPTELANGANA: ఆచార్య చాణక్యుడి రాజనీతి శాస్త్ర ప్రకారం ఏ వ్యవస్థలో అయినా విజయవంతం కావాలంటే కచ్చితంగా క్రమశిక్షణతో పాటు మెరుగైన నిర్ణయాలు తీసుకుంటూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే లక్షణాలు కలిగుండాలి. ఈ రాజనీతి సూత్రాన్ని ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదలకు అవకాశాలున్నా, సరైన మార్గదర్శం లేక అంతర్గత కుమ్ములాటలతో పార్టీ రోజురోజుకు బలహీనపడుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల ఎన్నికలతో బీజేపీ అధిష్టానం బిజీగా ఉండడంతో తెలంగాణపై…
Telangana: బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న శ్వేత ప్రసాద్..!
Hyderabad: నగరానికి చెందిన శ్వేత ప్రసాద్ కర్ణాటక సంగీతం విభాగములో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా చేతుల మీదుగా శ్వేత ప్రసాద్ పురస్కారం అందుకున్నట్లు సంగీత నాటక అకాడమీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా ప్రతి ఏటా సంగీత విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను ఈ యువ పురస్కారం కోసం ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే…