‘సెంగోల్’—వీర చోళుల సాంప్రదాయ ప్రతిష్ట.భారత సనాతన ధర్మ శక్తి కాలానికి అతీతంగా నిత్య తేజస్సుతో తరాలు మారినా ప్రకాశిస్తూనే ఉంటుంది. పవిత్ర బంగారు రాజదండంగా భారతీయ చారిత్రాత్మక, వారసత్వ, ఆధ్యాత్మిక చరిత్రకు నిదర్శనం.
1947లో స్వాతంత్ర్య సిద్ధి సమయంలో తిరువావధూతురై నుండి ఢిల్లీకి చేరిన పవిత్ర రాజదండం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చొరవతో తిరిగి నూతన పార్లమెంట్ లో స్పీకర్ ప్రాంగణంలో ప్రతిష్టించబోతుండడంతో అది తిరిగి తన పునర్వైభవాన్ని పొందనుంది.
పవిత్ర రాజదండం కేవలం భారతదేశ సంపద మాత్రమే కాదు.భారత వారసత్వ సంపద గొప్పతనానికి…చట్టబద్ధ పాలనకు, స్వేచ్ఛ భారతానికి…. కాల పరీక్షకు తట్టుకొని నిలబడిన భారతదేశ సంస్కృతి,సంప్రదాయాల, ఆచారాల గొప్పతనానికి ప్రతీక.