చిత్తూరు జిల్లా మదనపల్లె కూతుళ్ళ హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను తాను కాళికా మాతగా భావించి భార్య పద్మజ కూతురి నాలుకను తినేసినట్లు భర్త పురుషోత్తం నాయుడు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయంపై పోస్టు మార్టం నివేదిక తర్వాత స్పష్టత వచ్చే అవకాశముంది. అంతేకాక కూతురు ఆలేఖ్య ‘ తాను పూర్వజన్మలో అర్జుడని .. కళాశాలలో పాఠాలు చెప్పడం నీ వృత్తి కాదని పాండవులు తరుపున అర్జునుడిలా పోరాటాన్ని ముందుండి కొనసాగించాలని తనకు చెప్పేదని ‘ నాయుడు వెల్లడించారు.
ఇక పద్మజా పురుషోత్తం మానసిక పరిస్థితి గురించి వైద్యులు వెల్లడిస్తూ వారికి ఎలాంటి వాతావరణంలో చికిత్స అందించాలని అందుకోసం విశాఖ లోని ప్రభుత్వ మానసిక చికిత్స కోసం కేంద్రం సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు.
కాగా పద్మజ సన్నిహితులను మానసిక వైద్యులు విచారించగా ఆమె తండ్రి కూడా 20 ఏళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నారని .. ఆమె మేనమామ సైతం ఇలాంటి లక్షణాలతో బాధ పడుతున్నారని .. వంశపారపర్యంగా పద్మజ కు కూతురు అలేఖ్యకు వంశపారంపర్యంగా ఇది సంక్రమించి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు.